ETV Bharat / city

బీసీలు అభివృద్ధి చెందినప్పుడే రాజ్యాధికారం సాధ్యం: ఎమ్మెల్సీ సునీత

author img

By

Published : Feb 3, 2021, 7:47 PM IST

బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. ఏ పార్టీ బీసీలకు అండగా ఉంటుందో...ఆ పార్టీకే బీసీలందరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు.

Feliciation To MLC Pothula Suneetha
ఎమ్మెల్సీ పోతుల సునీతకు సన్మానం

ఏ జెండా కింద ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని నాడు తెదేపాతో పని చేసినా... అదే లక్ష్యంతో పనిచేశామని వైకాపా ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. విజయవాడలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పోతుల సునీతకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. విద్య, ఆర్ధిక, సామాజిక రంగాల్లో బీసీలు అభివృద్ధి చెందినప్పుడే రాజ్యాధికారం సాధ్యమన్నారు.

తెదేపాతో 20 సంవత్సరాలు పని చేసినా బీసీల అభివృద్ధి కోసమే నిరంతరం కృషి చేశామన్నారు. జగన్మోహన్ రెడ్డి మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనను నచ్చి మండలిలో ఆ పార్టీకి మద్దతు తెలిపానన్నారు.

ఇదీ చదవండి: పల్లెపోరుకు దూరంగా...రాజధాని గ్రామాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.