ETV Bharat / city

కరోనాతో మాజీ మంత్రి పి.మాణిక్యాలరావు కన్నుమూత

author img

By

Published : Aug 1, 2020, 3:49 PM IST

Updated : Aug 1, 2020, 8:09 PM IST

manikyalarao
మాజీ మంత్రి పైడికొండలరావు కన్నుమూత

15:47 August 01

మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి

మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కన్నుమూత

భాజపా నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు కన్నుమూశారు. జులై మొదటి వారంలో కరోనా బారిన పడ్డ ఆయన... వెంటనే ఏలూరులోని ఆశ్రమ కోవిడ్‌ కేంద్రంలో చేరారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం విజయవాడ హెల్ప్ ఆస్పత్రికి తరలించారు. 

9 రోజులుగా వెంటిలేటర్ పై ఉన్న మాణిక్యాలరావు .. అనారోగ్య సమస్యలు చుట్టిముట్టి తుదిశ్వాస విడిచారు. రెండ్రోజులుగా ఆరోగ్యం పూర్తిగా విషమించిందని... పచ్చకామెర్లు, ఊపిరితిత్తుల సమస్యతో పాటు.... బీపీ హెచ్చుతగ్గులతో తుదిశ్వాస విడిచారని వైద్య బృందాలు తెలిపాయి.

ప్రస్థానం..

  • 1961 నవంబర్‌ 1న తాడేపల్లిగూడెంలో పైడికొండల మాణిక్యాలరావు జననం
  • తాడేపల్లిగూడెంలో పాఠశాల విద్య, పెంటపాడులో కళాశాల విద్య అభ్యాసం
  • పైడికొండల మాణిక్యాలరావుకు భార్య సూర్యకుమారి, కుమార్తె సింధు
  • తెదేపా-భాజపా కూటమి అభ్యర్థిగా 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక
  • తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నిక
  • 2014లో తెదేపా ప్రభుత్వంలో దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు
  • చిన్నప్పటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌లో పనిచేసిన మాణిక్యాలరావు
  • 9 ఏళ్ల వయస్సులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో చేరిన మాణిక్యాలరావు
  • భాజపా ఆవిర్భావం నుంచి పార్టీలోనే కొనసాగుతున్న మాణిక్యాలరావు
  • ఫొటోగ్రాఫర్‌గా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన మాణిక్యాలరావు
  • ఫోటోస్టూడియో మూసివేసి 'సింధు షూమార్ట్' ప్రారంభించిన మాణిక్యాలరావు
  • సింధు ఎంటర్‌ప్రైజెస్‌గా మార్చి ఆటోమొబైల్ విడిభాగాల విక్రయాలు చేసిన మాణిక్యాలరావు
  • 2011-2013 వరకు మానవత సంస్థ తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షునిగా సేవా కార్యక్రమాలు
  • మానవత సేవా సంస్థ ద్వారా జిల్లాలోని పలు పట్టణాల్లో శీతల శవపేటికలు ఉచితంగా ఏర్పాటు

ప్రముఖుల సంతాపం

మాణిక్యాలరావు మృతిపై వివిధ పార్టీల నేతలు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి జగన్‌తో పాటు... విపక్షనేత చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో మాణిక్యాలరావు అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం జగన్​ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్​కు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

మాణిక్యాలరావు నిబద్ధత గల వ్యక్తని ఆ పార్టీ శ్రేణులు స్మరించుకున్నాయి. తాడేపల్లిగూడెంలో పైడికొండల ట్రస్టు తరపున ధార్మిక, సేవా కార్యక్రమాలు ఎన్నో నిర్వహించారని కన్నీటిపర్యంతమయ్యారు.

ఇదీ చూడండి..

విశాఖలో ఘోరం.. క్రేన్​ ప్రమాద చిత్రాలు

Last Updated :Aug 1, 2020, 8:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.