యూఏఈలోని తెలుగు ప్రజలు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయి విదేశాల నుంచి స్వదేశాలకు రాలేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉపాధి లేక.. తిండి దొరకడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆవేదనను వీడియో రూపంలో చిత్రికరించారు. ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు ఉన్న గదుల వద్దే.. తాము కూడా నివసించాల్సి వస్తోందని... ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నామని వాపోతున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు తెలియడం లేదని అంటున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: విదేశాల్లోని భారతీయుల కోసం కేంద్రం 'మెగాప్లాన్'