ETV Bharat / city

'కష్ట కాలంలో కేసుల పేరిట వేధింపులేంటి..?'

author img

By

Published : Apr 29, 2020, 4:06 PM IST

కరోనా మూలంగా కష్టాల్లో ఉన్న రాజధాని రైతులను కేసుల పేరిట వేధించటం తగదని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. రాజధాని రైతుల కౌలు, భూమి లేని పేదలకు పింఛన్లను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వారిని ఇబ్బంది పెట్టడం మానుకోవాలని హితవు పలికారు.

pawan kalyan
pawan kalyan

రాజధాని రైతులను ఇబ్బందిపెట్టే చర్యలను ప్రభుత్వం సత్వరమే నిలిపివేయాలని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. సమీకరణలో భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు, భూమిలేని పేదల పింఛన్లు విడుదల చేయాలని ట్విటర్​లో డిమాండ్ చేశారు. కరోనా కాలంలోనూ సామాజిక దూరం పాటిస్తూ రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారన్న పవన్... ఇలాంటి తరుణంలో వారిపై పాత కేసుల పేరుతో స్టేషన్​లకు తీసుకెళ్లడం తగదని అన్నారు. లాక్​డౌన్ విధించిన సమయంలోనే సీఆర్​డీఏ మాస్టర్ ప్లాన్​లో ఆర్​-5 జోన్​ నిబంధనలు చేర్చి రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తామనడం రాజధాని రైతులను మానసిక ఆందోళనకు గురిచేయడమే అవుతుందని పవన్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేయడం సరికాదని సూచించారు.

ఇదీ చదవండి

రాష్ట్రంలో కొత్తగా 73 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.