ETV Bharat / city

సీఎం జగన్​కు సీపీఐ రామకృష్ణ లేఖ

author img

By

Published : May 19, 2021, 10:50 AM IST

CPI Ramakrishna
సీపీఐ రామకృష్ణ

రాష్ట్రంలో ఆక్సిజన్ అందక మరణించిన మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్​కు లేఖ రాశారు.

ముఖ్యమంత్రి జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. తిరుపతి రుయాలో ఆక్సిజన్ అందక 23 మంది మరణిస్తే.. ప్రభుత్వం మాత్రం 11 మందినే గుర్తించి పరిహారం ప్రకటించిందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్ అందక 76 మంది మరణించారని సీపీఐ నేత రామకృష్ణ స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని లేఖలో డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

4 జిల్లాల ఆస్పత్రుల్లో సీటీ స్కాన్, ఎంఆర్ఐ యంత్రాలు ప్రారంభించనున్న సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.