ETV Bharat / city

సాగునీటి వినియోగంపై కేసీఆర్‌ వైఖరి సరైంది కాదు: రామకృష్ణ

author img

By

Published : Aug 11, 2020, 2:42 PM IST

సాగునీటి వినియోగంపై తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరి సరికాదని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు.. భేటీ అయి సామరస్యంగా సమస్యను పరిష్కరించాలని సూచించారు.

cpi rama krishna
cpi rama krishna

సాగునీటి వినియోగంపై తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరి సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఇటు జగన్మోహన్ రెడ్డి, అటు కేసీఆర్​.. రాజకీయంగా, వ్యక్తిగతంగా సహకరించుకుంటూ.. విందులు చేసుకుంటూ ప్రజా సమస్యల విషయంలో మాత్రం వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

గోదావరిలో పుష్కలంగా ఉన్న నీటిని రెండు తెలుగు రాష్ట్రాలు సక్రమంగా వినియోగించుకుంటే అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. కానీ.. ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు జల వివాదాలకు తావిస్తూ.. అపెక్స్​ కౌన్సిల్​కు వెళ్లారని విమర్శించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్యంగా సమస్యను పరిష్కరించాలని సూచించారు.

ఇదీ చదవండి:

మాకు మహానగరాలు లేవు.. మెరుగైనవైద్యం కోసం సహకారం ఇవ్వండి: సీఎం

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.