ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 207 కరోనా పాజిటివ్‌ కేసులు

author img

By

Published : Jun 12, 2020, 1:02 PM IST

Updated : Jun 12, 2020, 1:29 PM IST

కొత్తగా 207 కరోనా పాజిటివ్‌ కేసులు
కొత్తగా 207 కరోనా పాజిటివ్‌ కేసులు

13:00 June 12

రాష్ట్రానికి చెందిన వారిలో కొత్తగా 141 మందికి కరోనా

207 కరోనా పాజిటివ్‌ కేసులు
207 కరోనా పాజిటివ్‌ కేసులు

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 11,775 మంది నమూనాలు పరీక్షించగా 207 పాజిటివ్‌ కేసులు నిర్ధరణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. వీటిలో విదేశాలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివే 66 ఉండగా.. రాష్ట్రంలో 141 పాజిటివ్‌ కేసులు వచ్చాయి.  

పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 5,636 కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ కారణంగా గడచిన 24 గంటల్లో ఎలాంటి మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 80. ఇప్పటివరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది 2,559 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 1723 మంది చికిత్స పొందుతున్నారు.

Last Updated : Jun 12, 2020, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.