ETV Bharat / city

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు

author img

By

Published : Aug 26, 2020, 7:23 PM IST

Updated : Aug 26, 2020, 7:47 PM IST

corona-effect-on-andhra-pradesh
corona-effect-on-andhra-pradesh

19:20 August 26

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 10,830 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనాతో మరో 81 మంది మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1528 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు

రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 10,830 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,82,469కి చేరింది. కరోనాతో మరో 81 మంది మృతి చెందారు. కరోనాతో ఇప్పటివరకు 3,541 మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 2,86,720 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 92,208 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 61,838 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటివరకు 34.18 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ప్రభుత్వం వెల్లడించింది.

జిల్లాల వారీగా మరణాలు...

తూర్పుగోదావరి జిల్లాలో 11, ప్రకాశం జిల్లాలో 9, చిత్తూరు, కడప జిల్లాల్లో 8 మంది చొప్పున కరోనాతో మృతి చెందారు. అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆరుగురు చొప్పున, కృష్ణా, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఐదుగురు చొప్పున మరణించారు. గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున కరోనాతో మృతి చెందారు.

జిల్లాల వారీగా కేసులు...

తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1528 కరోనా కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో 1168, విశాఖ జిల్లాలో 1156, పశ్చిమగోదావరి జిల్లాలో 1065, చిత్తూరు జిల్లాలో 913, ప్రకాశం జిల్లాలో 786, కర్నూలు జిల్లాలో 745, కడప, అనంతపురం జిల్లాల్లో 728, శ్రీకాకుళం జిల్లాలో 618, విజయనగరం జిల్లాలో 564, గుంటూరు జిల్లాలో 532, కృష్ణా జిల్లాలో 24 గంటల వ్యవధిలో 299 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

ఇదీ చదవండీ... ఎందుకంత తొందర.. రాజధానిపై హైకోర్టు ఉత్తర్వులను అడ్డుకోం: సుప్రీం

Last Updated : Aug 26, 2020, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.