చిరు వ్యాపారులు, సంప్రదాయ వృత్తులు చేసుకునే వారికి వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన 'జగనన్న తోడు' పథకాన్ని సీఎం జగన్ ఈనెల 6న ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 9.08 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. వీరికి ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ. 10వేల వరకు వడ్డీలేని రుణాన్ని బ్యాంకుల ద్వారా అందిస్తారు. ఇందుకుగాను రూ.474 కోట్లను ప్రభత్వం ఖర్చు చేయనుంది.
ఈ రుణం మీద అయ్యే వడ్డీ రూ.52 కోట్లను ప్రభుత్వమే భరిస్తుంది. ఇంకా అర్హులెవరైనా ఉంటే గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సోమవారం ఒక ప్రకటనలో సూచించారు.
ఇదీ చదవండి: 'తాజా ధరలతోనే పోలవరం.. ఈ మేరకు మీరే సిఫార్సు చేయండి'