ETV Bharat / city

6న 'జగనన్న తోడు' ప్రారంభం

author img

By

Published : Nov 3, 2020, 7:28 AM IST

'జగనన్న తోడు' పథకాన్ని సీఎం జగన్ ఈనెల 6న ప్రారంభించనున్నారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్‌ కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పథకం కింద బ్యాంకుల నుంచి చిరు వ్యాపారులకు రుణాలు ఇప్పించడంతోపాటు ఆ రుణాలపై అయ్యే వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ. 10వేల వరకు వడ్డీలేని రుణాన్ని బ్యాంకుల ద్వారా అందిస్తారు.

cm jagan will start jagananna thodu scheme on 6th november
6న 'జగనన్న తోడు' ప్రారంభం

చిరు వ్యాపారులు, సంప్రదాయ వృత్తులు చేసుకునే వారికి వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన 'జగనన్న తోడు' పథకాన్ని సీఎం జగన్ ఈనెల 6న ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 9.08 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. వీరికి ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ. 10వేల వరకు వడ్డీలేని రుణాన్ని బ్యాంకుల ద్వారా అందిస్తారు. ఇందుకుగాను రూ.474 కోట్లను ప్రభత్వం ఖర్చు చేయనుంది.

ఈ రుణం మీద అయ్యే వడ్డీ రూ.52 కోట్లను ప్రభుత్వమే భరిస్తుంది. ఇంకా అర్హులెవరైనా ఉంటే గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సోమవారం ఒక ప్రకటనలో సూచించారు.

ఇదీ చదవండి: 'తాజా ధరలతోనే పోలవరం.. ఈ మేరకు మీరే సిఫార్సు చేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.