ETV Bharat / city

Jagan Review: ఐటీ కేంద్రంగా విశాఖ: ముఖ్యమంత్రి

author img

By

Published : Jun 23, 2021, 6:19 PM IST

Updated : Jun 24, 2021, 6:11 AM IST

భవిష్యత్తులో ఐటీ రంగానికి విశాఖ కేంద్రంగా మారుతుందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏర్పాటయ్యే సంస్థలకు ఏటా ప్రోత్సాహకాలు ఇస్తామని.. కనీసం ఒక ఏడాది ఉద్యోగి అదే కంపెనీలో పని చేయాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో నాణ్యమైన అంతర్జాల సేవలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు.

ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి
ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి

ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్‌ తయారీ క్లస్టర్స్, డిజిటల్‌ లైబ్రరీలపై ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. యువతకు ఉద్యోగాలు రావడమే ఐటీ పాలసీ ప్రధాన ఉద్దేశమని సీఎం జగన్ స్పష్టం చేశారు. పిల్లలకు హైఎండ్‌ స్కిల్స్‌ నేర్పించాలని ఆదేశించారు. హైఎండ్‌ స్కిల్స్‌ నేర్పే సంస్థలకు ప్రోత్సాహకాలు ఇస్తామన్న సీఎం.. నైపుణ్యాలతో ప్రపంచ స్థాయిలో పోటీపడే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. ఉద్యోగాల కల్పనకు విశాఖ ప్రధాన కేంద్రం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

భవిష్యత్తులో ఐటీ రంగానికి విశాఖ కేంద్రంగా మారుతుందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. నాణ్యమైన విద్యకు విశాఖను కేంద్రంగా చేయాలని.. ఐటీ రంగంలో అత్యుత్తమ వర్సిటీని విశాఖలో తీసుకురావాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏర్పాటయ్యే సంస్థలకు ఏటా ప్రోత్సాహకాలు ఇస్తామని.. కనీసం ఒక ఏడాది ఉద్యోగి అదే కంపెనీలో పని చేయాలని స్పష్టం చేశారు. ఏడాది తర్వాత సంస్థకు ప్రోత్సాహకాల చెల్లింపులు ఉంటాయని వివరించారు.

వర్క్‌ఫ్రం హోం కార్యాచరణ బలోపేతానికి చర్యలు చేపట్టాలి. గ్రామాల్లో నాణ్యమైన అంతర్జాల సేవలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రతి గ్రామ పంచాయతీలో డిజిటల్‌ లైబ్రరీల ఏర్పాటు చేస్తాం. డిసెంబర్‌ కల్లా 4 వేల గ్రామాలకు అంతర్జాల సేవలకు చర్యలు తీసుకుంటాం. డిసెంబర్‌ కల్లా డిజిటల్‌ లైబ్రరీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. పంచాయతీల్లో రెండేళ్లలో డిజిటల్‌ లైబ్రరీలు ఏర్పాటు చేయాలి. విశాఖ, తిరుపతి, అనంతపురంలో కాన్సెప్ట్‌ సిటీలు ఏర్పాటు చేస్తాం. కాన్సెప్ట్‌ సిటీల ఏర్పాటుకు భూములు గుర్తించాలి. కాన్సెప్ట్‌ సిటీల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలి. -ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి

భవిష్యత్తులో ఐటీ రంగానికి విశాఖ కేంద్రంగా మారుతుంది. ఐటీ రంగానికి సంబంధించిన అత్యుత్తమ విశ్వవిద్యాలయాన్ని అక్కడ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ విమానాశ్రయం నగర స్థాయిని మరింతగా పెంచుతాయి. వీటన్నింటితో కంపెనీలకు విశాఖ ఆకర్షణీయంగా మారుతుంది. ఉద్యోగాల కల్పనకు ప్రధాన కేంద్రం అవుతుంది.

- సీఎం

మహిళలంతా దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేలా చూడాలి
ప్రమాదకర పరిస్థితుల్లో దిశ యాప్‌ను ఎలా వినియోగించాలో మహిళలకు అవగాహన కల్పించాలని, దీన్నో డ్రైవ్‌గా నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి మహిళలు ఫోన్లలో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేలా చూడాలని... కళాశాలలు, విద్యా సంస్థల్లో విద్యార్థినులకు యాప్‌ వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు. మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. మహిళా భద్రత అంశంపై బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘దిశ యాప్‌పై పూర్తి చైతన్యం కలిగించాలి. గ్రామ సచివాలయాల్లోని మహిళా పోలీసులు, వాలంటీర్లతో మహిళలకు అవగాహన కల్పించాలి. ఇందుకోసం ముందుగా మహిళా పోలీసులకు, వాలంటీర్లకు శిక్షణ ఇవ్వాలి. ఇలాంటి చర్యలతో దిశ యాప్‌ వినియోగం పెరుగుతుంది. మహిళలను ఆదుకునేందుకు తక్షణ చర్యలు తీసుకునేలా యంత్రాంగం సిద్ధం కావాలి. దిశ పోలీసు స్టేషన్లు, స్థానిక పోలీసు స్టేషన్లు సత్వరం స్పందించేలా సన్నద్ధం చేయాలి. స్టేషన్లకు అవసరమైన పెట్రోలింగ్‌ వాహనాలను సమకూర్చాలి’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమావేశంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, నిఘా విభాగం అధిపతి కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎం కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండీ... JAGAN-CHIRU TWEETS: చిరంజీవి ట్వీట్​పై స్పందించిన జగన్​..ఏమన్నారంటే

Last Updated :Jun 24, 2021, 6:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.