ETV Bharat / city

'తొలిదశలో 1 నుంచి 6వ తరగతి వరకే ఆంగ్లమాధ్యమం'

author img

By

Published : Nov 9, 2019, 1:00 PM IST

Updated : Nov 9, 2019, 4:17 PM IST

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల ల్యాబ్​లు ఏర్పాటు చేయాలి

పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధనపై రాష్ట్ర ప్రభుత్వం కొద్దిమేర సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. తొలిదశలో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు మాత్రమే ఆంగ్లమాధ్యమాన్ని వర్తింప చేయాలంటూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమ బోధనపై ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. తొలిదశలో భాగంగా.. 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకే వర్తింపజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమ బోధనకు పూర్తిస్థాయిలో సన్నద్ధత లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆంగ్ల బోధనపై సీనియర్ అధికారులతో సమావేశమై సమీక్షించిన సీఎం.. ఈ ఆదేశాలు ఇచ్చారు. ప్రతీ ప్రభుత్వ పాఠశాలలోనూ ఆంగ్ల భాషకు చెందిన ప్రయోగశాలను ఏర్పాటు చేయాలని సీఎం స్పష్టం చేశారు. నాడు-నేడులో భాగంగా ఇంగ్లీష్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి.. మొదటి దశలో 1 నుంచి 6వ తరగతి వరకూ ఇంగ్లీషు మాధ్యమంలో బోధించాలని స్పష్టం చేశారు. పాఠశాలల్లో సీబీఎస్ఈ, ఐసీఎస్ విధానాలను పాటించాలని సూచించారు.

ఇదీ చదవండి: 'ఆంగ్ల మాధ్యమం కచ్చితంగా అమలు చేస్తాం'

Intro:Body:Conclusion:
Last Updated :Nov 9, 2019, 4:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.