ETV Bharat / city

'ఆ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని సీఎం నిర్ణయం'

author img

By

Published : Jun 16, 2022, 5:06 PM IST

Updated : Jun 16, 2022, 5:26 PM IST

సచివాలయం
సచివాలయం

17:03 June 16

డిపార్ట్‌మెంటల్ పరీక్ష ఉత్తీర్ణులైన వారికే ప్రొబేషన్ డిక్లరేషన్‌

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు ప్రొబేషన్‌ డిక్లేర్‌ దస్త్రంపై ముఖ్యమంత్రి సంతకం చేశారు. డిపార్ట్‌మెంటల్ పరీక్ష ఉత్తీర్ణులైన వారికే ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయనున్నారు. ప్రొబేషన్ ఇచ్చే అధికారం కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుంది.

ప్రొబేషన్ డిక్లేర్ చేసిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కొత్త పీఆర్‌సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని సీఎం జగన్‌ సూచించారు. జులై 1నుంచి ఉద్యోగులకు పీఆర్‌సీ వర్తింపజేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40వేల మందికి పైగా సచివాలయ ఉద్యోగులు ఏపీపీఎస్సీ నిర్వహించిన డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలో ఉత్తీర్ణులైనట్టు సమాచారం.

ఇదీ చదవండి:

Last Updated :Jun 16, 2022, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.