కమిటీలు వేయడం కాదు.. ఆ పని చేయాలి : చంద్రబాబు

author img

By

Published : Aug 4, 2022, 4:55 PM IST

CHANDRABABU

CHANDRABABU: అచ్యుతాపురం సెజ్​ పరిశ్రమ ప్రమాద ఘటనపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక.. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్‌ మొదలుకుని.. పారిశ్రామిక ప్రమాదాలు జరగడం, కార్మికులు బలవ్వడం సాధారణమైపోయిందని ఆరోపించారు.

CHANDRABABU: వైకాపా ప్రభుత్వం వచ్చాక విశాఖలో వరస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పారిశ్రామిక ప్రమాదాలు, కార్మికుల మరణాలు సాధారణమయ్యాయని విమర్శించారు. ప్రమాదాలపై కమిటీలు వేసి చేతులు దులుపుకుంటే సరిపోదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై పర్యవేక్షణ కొరవడిందని.. ప్రభుత్వం మేల్కొని పారిశ్రామిక ప్రమాదాలను నివారించాలని సూచించారు. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్​ చేశారు.

  • కమిటీలు వేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై పై పర్యవేక్షణ ఉంటే ఇన్ని ప్రమాదాలు జరగవు, లోపం ప్రభుత్వంలోనే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పారిశ్రామిక ప్రమాదాలను నివారించాలి. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి.(4/4)

    — N Chandrababu Naidu (@ncbn) August 4, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.