ETV Bharat / city

రాష్ట్ర వ్యాప్త నిరసనలకు చంద్రబాబు పిలుపు

author img

By

Published : May 19, 2020, 9:54 AM IST

chandrababu on current bills
రాష్ట్ర వ్యాప్త నిరసనలుకు చంద్రబాబు పిలుపు

విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా తెదేపా ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. నేతలు ఇళ్లల్లోనే ఉండి నిరసనలు తెలపాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.

విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్త నిరసనలకు తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. అన్ని మండలాలు, నియోజకవర్గాల్లో నేతలు ఇళ్లల్లోనే ఉంటూ నిరసన దీక్షలు చేయాలని సూచించారు. 3 నుంచి 4 రెట్లు విద్యుత్ ఛార్జీలను పెంచటాన్ని నిరసిస్తున్నామన్నారు. ప్రజలు క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే, కరెంటు బిల్లులు పెంచటం హేయమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: ఎల్జీ పాలిమర్స్ ఎండీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.