ETV Bharat / city

ఇసుక తవ్వకాలలో మోసం.. తెలంగాణ మాజీ మంత్రి, మాజీ సీపీపై కేసు నమోదు

author img

By

Published : Sep 16, 2022, 4:36 PM IST

case
case

Case Filed on Ex minister Shabbir Ali: తెలంగాణలో ఇసుక తవ్వకాలలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ సీపీ ఏకే ఖాన్​పై కేసు నమోదు అయ్యింది. ఇసుక తవ్వకాల్లో పెట్టుబడి కోసం రూ.90 లక్షలు తీసుకుని మోసం చేశారని.. అబ్దుల్‌ వాహబ్‌ అనే వ్యక్తి నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు ఇద్దరితో పాటు ఏకే ఖాన్ తనయుడిపైనా కేసు నమోదు చేశారు పోలీసులు.

Case Filed on Ex minister Shabbir Ali: ఇసుక తవ్వకాల్లో మోసం చేశారనే ఆరోపణలపై కాంగ్రెస్ మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ సీపీ ఏకే ఖాన్​తో పాటు ఏకే ఖాన్‌ కుమారుడు మోసిన్ ఖాన్‌పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇసుక తవ్వకాల కోసం పెట్టుబడుల రూపంలో రూ.90 లక్షలు తీసుకున్నారని బాధితుడు అబ్దుల్ వాహబ్ నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. అబ్దుల్ ఫిర్యాదుతో నాంపల్లి కోర్టు నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

'2016లో ఇసుక తవ్వకాల కోసం మోసిన్‌ ఖాన్ రూ. 90 లక్షలు తీసుకున్నాడు. ఖమ్మంలో 46 ఎకరాల్లో ఇసుక రీచ్‌ల కాంట్రాక్ట్‌ దక్కిందని నమ్మించాడు. ఐదేళ్లు గడిచినా లాభాలు ఇవ్వలేదు. ఎన్నిసార్లు అడిగినా మాట దాటవేసేవాడు. కొన్నిరోజుల తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశాడు.' అని బాధితుడు కోర్టుకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.