ETV Bharat / city

'క్యాన్సర్​పై అపోహలే ప్రాణాంతకంగా మారుతున్నాయి'

author img

By

Published : Feb 15, 2020, 10:32 PM IST

cancer-awareness-program-at-basavatarakam
'క్యాన్సర్​పై అపోహలే ప్రాణాంతకంగా మారుతున్నాయి'

క్యాన్సర్ వ్యాధిపై ఉన్న అపోహలే రోగులకు ప్రాణాంతకంగా మారుతున్నాయని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్టీ నందమూరి బాలకృష్ణ అన్నారు. అంతర్జాతీయ చైల్డ్​హుడ్ క్యాన్సర్​ డేని పురస్కరించుకుని ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సినీనటి రష్మికా మందనతో కలిసి ఆయన పాల్గొన్నారు.

'క్యాన్సర్​పై అపోహలే ప్రాణాంతకంగా మారుతున్నాయి'

చిన్నారులు భగవంతునితో సమానమని, వారిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బసవతారకం క్యాన్సర్​ ఆసుపత్రి ట్రస్టీ, సినీనటుడు బాలకృష్ణ తెలిపారు. అంతర్జాతీయ చైల్డ్​హుడ్ క్యాన్సర్​ డేని పురస్కరించుకుని హైదరాబాద్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సినీనటి రష్మికా మందనతో కలిసి ఆయన పాల్గొన్నారు. బసవతారకం వైద్యశాల తరఫున క్యాన్సర్​తో బాధపడుతున్న చిన్నారుల సహాయార్థం చిల్డ్రన్ క్యాన్సర్ ఫండ్​ను లాంచ్​ చేశారు.

భయం..అపోహలు వద్దు...

క్యాన్సర్​ వ్యాధిపై ఉన్న భయం, అపోహలే రోగులకు ప్రాణాంతకంగా మారుతున్నాయని ఆయన చెప్పారు. వ్యాధి నివారణకు చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు. ఎవరి కుటుంబంలోనైనా వంశపారంపర్యంగా క్యాన్సర్ వస్తున్నట్లయితే వారు తరచూ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని సినీనటి రష్మిక మందన సూచించారు. ఆ మహమ్మారి తమ కుటుంబాన్ని బాధించిందన్నారు. కార్యక్రమంలో క్యాన్సర్​ను జయించిన పలువురు చిన్నారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ప్లాస్టిక్​ నిషేధంపై రామవరప్పాడులో కలెక్టర్​ అవగాహన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.