ETV Bharat / city

తెలంగాణ: డబ్బు, అధికార బలంతోనే తెరాస గెలిచింది: రాంచందర్​రావు

author img

By

Published : Mar 21, 2021, 11:17 AM IST

bjp mlc candidate ramchander rao
తెలంగాణ: డబ్బు, అధికార బలంతోనే తెరాస గెలిచింది: రాంచందర్​రావు

డబ్బు, అధికార బలంతోనే తెరాస గెలిచిందని భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్​రావు ఆరోపించారు. ప్రభుత్వంపై వ్యతిరేక ఓటు చాలా స్పష్టంగా కన్పించిందని వెల్లడించారు. 2023 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.

తెలంగాణ: డబ్బు, అధికార బలంతోనే తెరాస గెలిచింది: రాంచందర్​రావు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు, అధికార బలంతోనే తెరాస గెలిచిందని భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్‌రావు ఆరోపించారు. ఈ ఎన్నికల్లో తెరాస దాదాపు 2 వందల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ఓటర్ల తీర్పును శిరసావహిస్తానన్న రాంచందర్‌రావు... భవిష్యత్‌లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఉద్యోగస్తులను బెదిరించారని విమర్శించారు. 2023లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేలా పోరాడతామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: రాజధాని వ్యాజ్యాలపై త్రిసభ్య ధర్మాసనం విచారణ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.