ETV Bharat / city

బాసర ట్రిపుల్‌ ఐటీలో ఫుడ్​ పాయిజన్​.. 600మంది విద్యార్థులకు అస్వస్థత

author img

By

Published : Jul 15, 2022, 6:45 PM IST

Updated : Jul 15, 2022, 8:22 PM IST

basara
basara

Basara IIIT: బాసర ఆర్‌జీయూకేటీ విద్యార్థులు అస్వస్థత గురయ్యారు. ఆర్‌జీయూకేటీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. అత్యవసరంగా క్యాంపస్‌లోనే విద్యార్థులకు చికిత్స చేస్తున్నారు.

Food Poison in Basara IIIT: నిర్మల్‌ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీలో మధ్యాహ్న భోజనం వికటించి 600 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం ఎగ్‌ఫ్రైడ్‌ రైస్‌ కలుషితం కావడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ప్రాథమికంగా గుర్తించారు. పీయూసీ-1, పీయూసీ-2 విద్యార్థుల మెస్‌ల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ రెండు మెస్‌లకు ఒకే చోట భోజనం తయారు చేస్తారు.

బాసర ట్రిపుల్‌ ఐటీలో ఫుడ్​ పాయిజన్
బాసర ట్రిపుల్‌ ఐటీలో ఫుడ్​ పాయిజన్

మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత విద్యార్థులకు ఒక్కొక్కరిగా వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. క్రమంగా పలువురు స్పృహ తప్పి పడిపోయారు. అప్రమత్తమైన అధికారులు క్యాంపస్‌లోనే ప్రాథమిక వైద్యం అందించారు. విద్యార్థుల సంఖ్య పెరగడంతో నిర్మల్‌, భైంసా వైద్యులను రప్పించి చికిత్స అందించారు. స్పృహ తప్పి పడిపోయిన కొందరు విద్యార్థులను నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల అస్వస్థతపై విచారణకు ఆదేశించారు. నిర్మల్ జిల్లా కలెక్టర్, బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్‌తో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు. అస్వస్థతకు కారణాలను గుర్తించి.. పునరావృతం కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:

Last Updated :Jul 15, 2022, 8:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.