ETV Bharat / city

'రంగులేయడం, రిబ్బన్​ కటింగ్​లు తప్ప 15 నెలల్లో ఏం చేశారు'

author img

By

Published : Aug 8, 2020, 1:53 PM IST

రాజధాని విషయంలో విజయసాయిరెడ్డితీరుపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్థంలేని పనులు చేస్తున్నారంటూ ఆ పార్టీ నేత అయ్యన్నపాత్రుడు విమర్శించారు. 15 నెలల్లో చేసిన ఒక్క అభివృద్ధి కార్యక్రమం గురించి చెప్పగలరా అంటూ విజయసాయి రెడ్డిని ప్రశ్నించారు.

ayyana patrudu
ayyana patrudu

రాజధాని అమరావతి విషయంలో విజయసాయిరెడ్డి తీరు.. అర్థంలేనిదిగా ఉందని అయ్యన్నపాత్రుడు విమర్శించారు. రైతులు ఇచ్చిన భూమి ప్రభుత్వం దగ్గర ఉంటే.. రిటర్నబుల్‌ ప్లాట్లు రైతుల దగ్గర ఉంటే ఇంకా ఇన్సైడర్ ట్రేడింగ్ ప్రభుత్వం చెప్పడమేంటని నిలదీశారు. మరుగుదొడ్లకు రంగులు వేయడం, ట్రాన్స్ఫార్మర్లకి రిబ్బన్ కట్టింగులు తప్ప, ఈ 15నెలల్లో మూడు ప్రాంతాల్లో చేసిన ఒక్క అభివృద్ధి కార్యక్రమం గురించి చెప్పగలరా అని ప్రశ్నించారు.

ఇదీ చదవండి: మొదటి లక్షకు 126 రోజులు... రెండో లక్షకు 11 రోజులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.