దసరా పండుగకు వెళ్తున్నారా... అయితే మీకో శుభవార్త

author img

By

Published : Sep 19, 2022, 8:05 PM IST

APSRTC SPECIAL BUSSES FOR DUSSEHRA

APSRTC SPECIAL BUSES FOR DUSSEHRA : దసరా పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లేవారి కోసం ఏపీఎస్​ఆర్టీసీ శుభవార్త చెప్పింది. అందుకోసం ఈ నెల 29 నుంచి వచ్చే నెల 10 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపింది. అయితే ఈసారి ప్రత్యేక బస్సులలో అదనపు ఛార్జీలు వసూలు చేయట్లేదని ప్రకటించింది.

APSRTC SPECIAL BUSES : దసరాకు సొంతూళ్లకు వెళ్లేవారి కోసం ఆర్టీసీ ఈ నెల 29 నుంచి వచ్చే నెల 10 వరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు 1,081 అదనపు బస్సులు ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే వసూలు చేస్తామన్న ఆర్టీసీ అధికారులు.. ప్రత్యేక బస్సుల్లోని టికెట్లకూ రిజర్వేషన్ సదుపాయం కల్పించారు. ఏపీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌లో ఈ ప్రత్యేక బస్సుల వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.