ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 5PM

author img

By

Published : Jul 18, 2022, 4:59 PM IST

AP Topnews@5pm
AP Topnews@5pm

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • వరద సహాయక చర్యలపై తెదేపా ఆగ్రహం.. ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
    వరదలతో జనాలు అల్లాడిపోతున్నారు. ముంపు బారిన పడ్డ ప్రజలు సర్వసం కోల్పోయారని.. వారికి కనీసం ఆహారం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోతోందని తెదేపా విమర్శించింది. వరద బాధితులకు ఇచ్చే సహాయం పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని ఆరోపించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
  • రెండు వారాల్లోగా ఆ నిధులు వెనక్కి ఇవ్వాలి.. ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం
    ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధుల మళ్లింపుపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. పీడీ ఖాతాలకు మళ్లించిన నిధులను.. రెండు వారాల్లోగా వెనక్కి ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
  • సాయం అందించాల్సిన నిధులు మళ్లించడమేంటి?: చంద్రబాబు
    కొవిడ్ బాధితులకు సాయంగా అందాల్సిన నిధులను దారి మళ్లించడమేంటని తెదేపా అధినేత చంద్రబాబు నిలదీశారు. దారి మళ్లించిన నిధులను వెంటనే ఎస్డీఆర్​ఎఫ్​ ఖాతాలో జమ చెయ్యాలని.. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు జగన్ రెడ్డి పాలనకు చెంపపెట్టు అని అన్నారు.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
  • నిన్ను విడిచి ఉండలేక.. భర్తతోనే భార్య
    వారిద్దరిదీ అన్యోన్య దాంపత్యం.. ఒకరంటే మరొకరికి ఎనలేని ప్రేమ.. ఇది చూసి కాలానికి కన్ను కుట్టిందేమో ఇద్దరినీ కొన్ని గంటల వ్యవధిలోనే ఈ లోకం నుంచి తీసుకెళ్లింది.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
  • వరదలో కొట్టుకుపోయిన ఏనుగు పిల్ల!
    ఒడిశాలో గతకొద్ది రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరుణుడి ప్రతాపానికి.. రాయగడలోని ఖైరా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భారీ వరదల ధాటికి ఓ ఏనుగు పిల్ల నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. దాన్ని గమనించిన స్థానికులు వీడియో తీసి.. సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు. మరోవైపు, గోదావరి నది ఉగ్రరూపం దాల్చడం వల్ల మల్కాన్​గిరి జిల్లాలో అనేక గ్రామాలు జలమయమయ్యాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
  • పండగలా రాష్ట్రపతి ఎన్నిక.. ఓటేసిన ఎంపీలు.. వీల్​ఛైర్​లో మన్మోహన్
    భారత 15వ రాష్ట్రపతి ఎన్నికకు నిర్వహించిన పోలింగ్​లో.. ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగా.. పార్లమెంట్ ప్రాంగణం ఎంపీలతో కళకళలాడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఎంపీలు పార్లమెంట్​లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వీల్​ఛైర్​లో వచ్చి ఓటేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
  • చిక్కుల్లో మణిరత్నం, విక్రమ్​.. నోటీసులు పంపిన కోర్టు!
    ప్రముఖ దర్శకుడు మణిరత్నం, హీరో విక్రమ్​పై ఓ న్యాయవాది పలు ఆరోపణలు చేశారు. కోర్టును ఆశ్రయించి.. వారికి నోటిసులు పంపారు. ఇంతకీ ఏం జరిగిందంటే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
  • రవిశాస్త్రికి పంత్​ ఊహించని 'గిఫ్ట్'​.. ఈలలతో మోగిపోయిన స్టేడియం!
    టీమ్​ఇండియా మాజీ హెడ్​ కోచ్​ రవిశాస్త్రిపై బ్యాటర్​ పంత్​ తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఇంగ్లాండ్​తో జరిగిన మూడో వన్డేలో విజయం సాధించిన తర్వాత రవిశాస్త్రికి ఓ ఊహించని బహుమతిని ఇచ్చాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
  • గుంతలో పడ్డ గున్న ఏనుగు.. సీపీఆర్​ చేసి రక్షించిన సిబ్బంది
    థాయ్‌లాండ్‌ నఖోన్ నాయొక్ రాష్ట్రంలోని ఖావో యాయ్ జాతీయ పార్క్​లో ఓ భారీ గుంతలో ఏడాది వయసున్న గున్న ఏనుగు పడిపోయింది. దాన్ని బయటకు తీసేందుకు తల్లి ఏనుగు శాయశక్తులా ప్రయత్నించింది. వర్షం, బురద కారణంగా దాని ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలోనే దాన్ని కాపాడేందుకు జంతు సంరక్షకులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇది గమనించిన తల్లి ఏనుగు.. మరింత ఆందోళనకు గురైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.