ETV Bharat / city

పంచాయతీరాజ్‌ శాఖ అధికారులకు ఎస్ఈసీ తాఖీదులు

author img

By

Published : Feb 1, 2021, 2:00 AM IST

Updated : Feb 1, 2021, 2:10 AM IST

పంచాయతీ ఎన్నికలకు ఆన్ లైన్​లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేయకపోవడంపై పంచాయతీరాజ్ శాఖ అధికారులపై ఎస్ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ఇవాళ అధికారులు ఈసీ కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్

పంచాయతీరాజ్‌శాఖ అధికారులకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాఖీదులు జారీ చేశారు.ఆన్‌లైన్‌లో నామినేషన్ల స్వీకరణ ఆదేశాలు పాటించకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ఎన్నికల కమిషన్‌కు రావాలని ఆదేశించారు. ఆన్‌లైన్‌లో నామినేషన్ల ఆమోదంపై పార్టీల విజ్ఞప్తిని గుర్తు చేశారు. అధికారులు ఈసీ కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

'చిత్తూరు, గుంటూరు జిల్లాలకు కలెక్టర్లుగా ఆ ఇద్దరిని నియమించండి'

Last Updated : Feb 1, 2021, 2:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.