ETV Bharat / city

ఉపాధి నిధులపై హైకోర్టు విచారణ రెండు వారాలు వాయిదా

author img

By

Published : Aug 11, 2020, 6:06 PM IST

ఉపాధి హామీ నిధులకు సంబంధించి విచారణ మరో రెండు వారాలకు వాయిదా పడింది. కేంద్ర తరఫున కౌంటర్​ దాఖలు చేసేందుకు అసిస్టెంట్​ సొలిసిటర్​ జనరల్​ సమయం కోరినందున హైకోర్టు విచారణ వాయిదా వేస్తూ ఆదేశాలిచ్చింది.

ఉపాధి నిధులపై హైకోర్టు విచారణ రెండు వారాలకు వాయిదా
ఉపాధి నిధులపై హైకోర్టు విచారణ రెండు వారాలకు వాయిదా

ఉపాధి హామీ నిధుల చెల్లింపులకు సంబంధించి దాఖలైన పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. కేంద్రం తరఫున కౌంటర్​ దాఖలు చేసేందుకు అసిస్టెంట్​ సొలిసిటర్​ జనరల్​ హరినాథ్​ న్యాయస్థానాన్ని సమయం కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈలోపు కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను హైకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామంది.

ఇదీ చూడండి..

హైకోర్టు ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించాలన్న పిటిషన్‌పై మళ్లీ విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.