ETV Bharat / city

నిధుల విడుదలపై ఎస్​ఈసీ పిటిషన్... హైకోర్టు విచారణ

author img

By

Published : Oct 21, 2020, 4:18 PM IST

ఎన్నికల సంఘానికి నిధుల విషయంపై ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పూర్తి వివరాలతో అఫిడవిట్​ను దాఖలు చేయాలని ఎస్​ఈసీని ఆదేశించింది.

ap hc
https://www.etvbharat.com/telugu/andhra-pradesh/jagte-raho/crime-news/not-finding-boy-who-kidnaped-in-mahabubabad/ap20201021121345746

రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం నిధులు కేటాయించట్లేదని.. నిర్వహణకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. నిధులలేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు.

వెంటనే నిధులు మంజూరు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి కొంత నిధులను కేటాయించామని ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ఈ విషయాలపై పూర్తి వివరాలతో అఫిడవిట్ ను దాఖలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది .

ఇదీ చదవండి:

తండ్రి స్నేహితులే కిడ్నాప్‌ చేశారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.