AP Governor Bishwabhushan Fell Sick: గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు మరోసారి అస్వస్థత

author img

By

Published : Nov 28, 2021, 10:33 PM IST

Updated : Nov 29, 2021, 1:59 AM IST

AP Governor Bishwabhushan
AP Governor Bishwabhushan Fell Sick ()

22:18 November 28

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​.. హైదరాబాద్‌ ఏఐజీ ఆస్పత్రికి తరలింపు

AP Governor Biswabhusan Fell Sick: రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మరోసారి అస్వస్థతకు(AP Governor Bishwabhushan Fell Sick) గురయ్యారు. దీంతో ఆయన్ని విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో తరలించారు. స్వల్ప అస్వస్థతకు గురికావడంతో స్థానికంగా ఉన్న ఓ డయాగ్నిస్టిక్ సెంటర్‌లో పరీక్షలు నిర్వహించిన అనంతరం....ఆయన్ని హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి(ap Governor shifted to AIG Hospital at Hyderabad) తరలించారు. ఇటీవల గవర్నర్ కరోనా బారినపడి కోలుకున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని నగరానికి వచ్చారు .

ఈ నెల 23న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
ఈ నెల 17న దిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్​ (AP governor) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు.

ఆయన స్వల్ప దగ్గు, జలుబుతో బాధపడుతున్నందున ముందు జాగ్రత్త చర్యగా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయించారు. ఇందులో కరోనా పాజిటివ్​గా తేలింది. ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న కొద్దిరోజుల తరువాత కోలుకున్నారు. ఈనెల 23వ తేదీనే ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. ఇంతలోనే మళ్లీ అస్వస్థతకు గురయ్యారు.

ఇదీ చదవండి:

AP Employees Unions future action for PRC: జగన్ సర్కారుపై ఉద్యోగ సంఘాల ఉద్యమం.. షెడ్యూల్ ప్రకటించిన నేతలు

Last Updated :Nov 29, 2021, 1:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.