ETV Bharat / city

ఈ నెల 15 లేదా 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు..!

author img

By

Published : Jun 7, 2020, 4:35 PM IST

Updated : Jun 7, 2020, 6:07 PM IST

ఈ నెల 15 లేదా 16 నుంచి రాష్ట్ర శాసనసభ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో సమావేశాలను సాధ్యమైనంత తక్కువ రోజులకు కుదించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బడ్జెట్​ సమావేశాల నిర్వహణపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని అసెంబ్లీ కార్యదర్శి చెబుతున్నారు.

ఈ నెల 15 లేదా 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు..?
ఈ నెల 15 లేదా 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు..?

శాసనసభ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఓటాన్ అకౌంట్ కోసం తెచ్చిన ఆర్డినెన్స్ గడువు ఈ నెల 30వ తేదీతో ముగియనున్న క్రమంలో ఈ నెల 15 లేదా 16 నుంచి సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశముంది. ఈనెల 18న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. 19న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత ఒకటి రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిపే అవకాశం ఉంది. కరోనా కారణంగా బడ్జెట్​ సమావేశాలను సాధ్యమైనంత తక్కువ రోజులకు కుదించే యోచనలో ప్రభుత్వం ఉంది.

ఇప్పటికే అసెంబ్లీ ప్రాంగణంలో ఒకరికి.. సచివాలయంలోనూ పలువురు ఉద్యోగులకు కరోనా సోకింది. ఈ క్రమంలో పరిమిత రోజుల్లో తగు జాగ్రత్తలు పాటిస్తూ సమావేశాలు నడపాలని నిర్ణయించింది. బడ్జెట్ సమావేశాల నిర్వాహణపై తమకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదని అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లోనే ప్రభుత్వం సమాచారం పంపనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి..

రాష్ట్రంలో కొత్తగా 199 కరోనా పాజిటివ్‌ కేసులు

Last Updated : Jun 7, 2020, 6:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.