ETV Bharat / city

రాజధానిని మార్చటం రాజ్యాంగ ధిక్కరణే... అమరావతి కేసులో వాదనలు

author img

By

Published : Nov 27, 2020, 3:54 PM IST

రాజధాని అమరావతిని మార్చటం రాజ్యాంగ ధిక్కరణే అని సీనియర్ న్యాయవాది సత్యప్రసాద్ రైతుల తరపున హైకోర్టులో వాదనలు వినిపించారు. రాజధాని వ్యాజ్యాలపై విచారించిన త్రిసభ్య ధర్మాసనం... తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

Andhra Pradesh High Court
Andhra Pradesh High Court

రాజధానికి సంబంధించి హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై రోజువారీ తుది విచారణ కొనసాగింది. రాజధానిని మార్చటం రాజ్యాంగ ధిక్కరణేనని సీనియర్ న్యాయవాది సత్యప్రసాద్ రైతుల తరపు వాదించారు. రాజధానిలో పలు భవనాలు నిర్మాణాలకు ఇప్పటికే కోట్ల రూపాయలు వెచ్చించారని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఇవాళ మధ్యాహ్నం వరకు రాజధాని అంశాలపై విచారణ జరిపిన కోర్టు... తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ఇదీ చదవండి

కాపులుప్పాడలో అతిథిగృహం నిర్మాణంపై హైకోర్టు కీలక ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.