ETV Bharat / city

'రాజధానిపై తీర్పు వచ్చే వరకు సీజే బదిలీ ఆపండి'

author img

By

Published : Dec 20, 2020, 5:40 PM IST

Amaravati farmers protest
Amaravati farmers protest

జస్టిస్ జేకే మహేశ్వరిని సిక్కింకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయంపై రాజధాని రైతులు రాష్ట్రపతి, సీజేఐకు లేఖలు రాసి ఈ-మెయిల్​ ద్వారా పంపారు. రాజధాని పిటిషన్లపై విచారణ తుది దశకు చేరుకున్నందున ఆయన బదిలీని ఆపాలని అందులో కోరారు.

రాజధాని పిటిషన్లపై తీర్పు వచ్చే వరకు జస్టిస్ జేకే మహేశ్వరి బదిలీని ఆపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే, రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​ను అమరావతి రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారికి విడివిడిగా లేఖలను ఈ-మెయిల్​ ద్వారా పంపారు.

రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన తమకు న్యాయం చేయాలని కోరారు. వైకాపా ప్రభుత్వం తమను అన్ని రకాలుగా మోసం చేయటంతో.. న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు. ఈ కేసుల్లో తుది తీర్పు వచ్చే సమయంలో ప్రధాన న్యాయమూర్తిని బదిలీ చేస్తే అది తమ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి

సినీ పరిశ్రమపై ఏపీ ప్రభుత్వ నిర్ణయం సరికాదు: సి.కల్యాణ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.