ETV Bharat / city

AMARAVATI FARMERS: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమరావతి రైతులు

author img

By

Published : Dec 15, 2021, 10:59 PM IST

AMARAVATI FARMERS: న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట అమరావతి రైతులు మహా పాదయాత్ర అంతిమంగా స్వామి వారి దర్శనంతో నేడు పూర్తైంది. వెంకన్నకు మెుక్కులు చెల్లించుకున్న వారు రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని వేడుకున్నారు.

AMARAVATI FARMERS
AMARAVATI FARMERS

AMARAVATI FARMERS COMPLETED LORD BALAJI DARSHAN: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని అమరావతి రైతులు దర్శించుకుని.. మెుక్కులు చెల్లించుకున్నారు. అమరావతినే ఏకైక రాజధానిగా ఉండాలని సంకల్పంతో.. ''న్యాయస్థానం నుంచి దేవస్థానం'' వరకు సాగిన యాత్ర శ్రీవారి దర్శనంతో పరిసమాప్తమైంది. 44 రోజులుగా అలుపెరగకుండా 450 కిలోమీటర్లు పాదయాత్రగా తిరుమలకు చేరుకున్న రైతులకు నేడు స్వామివారి దర్శన భాగ్యం కలిగింది.

మధ్యాహ్నం 12 గంటల నుంచి స్లాట్ల వారీగా 850 మందికి తితిదే దర్శన అవకాశం కల్పించింది. ఐకాస నాయకులు పాదయాత్రగా వెళ్లిన రైతులను సమన్వయపరుస్తూ.. రూ. 300 టిక్కెట్లను అందించి దర్శనం చేయించారు. సాయంత్రం ఆరు గంటలకు సుపథం నుంచి ఆలయానికి చేరుకున్న ఐకాస నాయకులు రైతులతో కలిసి తిరుమలేశుని దర్శించుకున్నారు. వెంకన్న దర్శనానికి వెళ్లే సమయంలోనే తిరుపతిలో సభ నిర్వహణకు కోర్టు అనుమతివ్వడంతో అమరావతి రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

Amaravati Farmers Meeting: తిరుపతిలో అమరావతి రైతుల సభకు హైకోర్టు అనుమతి

TIRUMALA: నేడు శ్రీవారిని దర్శించుకోనున్న అమరావతి రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.