రెండు నెలలు పెండింగ్లో ఉన్న 50 శాతం జీతాలు చెల్లించేలా చూడాలని.. సచివాలయంలో సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్కు అమరావతి ఉద్యోగ సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఉద్యోగం సఘాల నేతలు బొప్పరాజు, వైవీ రావు ఆయన్ను కలిశారు. వీటిని జులై నెల జీతంతో కలిపి ఇవ్వాలని కోరారు. ఉద్యోగుల వేతనాలు, సమస్యలను ప్రవీణ్ ప్రకాశ్ దృష్టికి తెచ్చారు.
లాక్డౌన్ వేళ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు 50 శాతం జీతాలు తీసుకున్నారని నేతలు తెలిపారు. ప్రభుత్వానికి పూర్తిగా సహకరించామని.. వేతన సవరణ జరగక.. డీఏలు అమలు కాక.. ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
సానుకూలంగా స్పందించారు
తమ సమస్యలపై సీఎం ముఖ్య కార్యదర్శి సానుకూలంగా స్పందించారని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. వీటిని సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పినట్లు వివరించారు.
ఇదీ చూడండి..