ETV Bharat / city

contempt of court case: కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్ అధికారులకు ఊరట

author img

By

Published : Sep 23, 2021, 4:03 PM IST

కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్ అధికారులకు(IAS officers contempt of court case) సింగిల్ జడ్జి విధించిన శిక్షను డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మహిళకు నష్టపరిహారం ఇవ్వటంలో జాప్యం చేశారంటూ గతంలో హైకోర్టు(high court)లో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది.

high court
high court

కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్ అధికారులకు(IAS officers contempt of court case) సింగిల్ జడ్జి విధించిన శిక్షను డివిజన్ బెంచ్(division bench) సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నెల్లూరు జిల్లాకు చెందిన సావిత్రమ్మ అనే మహిళకు నష్టపరిహారం ఇవ్వటంలో జాప్యం చేశారంటూ గతంలో హైకోర్టు(high court)లో సింగిల్ జడ్జి ముందు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది.

పిటిషన్​పై విచారణ జరిపిన ధర్మాసనం విశ్రాంత అధికారి మన్మోహన్ సింగ్, ముత్యాలరాజు ,శేషగిరిబాబు, చక్రధర్ బాబులకు శిక్ష విధించింది .దీనిపై ప్రభుత్వం ద్విసభ్య ధర్మాసనం ముందు అప్పీల్​కు దాఖలు చేసింది. అప్పీల్ పై విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ .. అప్పీల్ పరిష్కారమయ్యేంత వరకు సింగిల్ జడ్జి(single judge) విధించిన శిక్షను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి

చంద్రబాబు ఇంటి వద్ద దాడి... నేతలకు హైకోర్టులో ఊరట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.