- YSRCP MP Candidates: వైకాపా రాజ్యసభ అభ్యర్థులు వీరే..
వైకాపా రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి జగన్ కసరత్తు ముగిసింది. సామాజిక సమీకరణాలు, పార్టీకి చేసిన సేవల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. వైకాపా పార్లమెంటరీ పార్టీ నేతగా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని వైకాపా మరోసారి పొడిగించింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ సీటు వరించింది.
- CM Jagan: గ్రీన్కో ప్రాజెక్టు వల్ల 20 వేల మందికి ఉపాధి: సీఎం జగన్
గ్రీన్కో ప్రాజెక్ట్ దేశానికి సరికొత్త మార్గం చూపుతుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. కర్నూలు జిల్లా గుమ్మితం తండాలో ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ స్టోరేజ్ (గ్రీన్కో) ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన చేశారు. మెగా పవర్ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి లభిస్తుందని సీఎం చెప్పారు.
- ప్రభుత్వాన్ని ఎంతోకాలం నడపలేమని సీఎం జగన్కు అర్థమైంది: చంద్రబాబు
జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత అన్ని వర్గాల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోందని తెదేపా అదినేత చంద్రబాబు అన్నారు. ప్రజా వ్యతిరేకత కారణంగా ప్రభుత్వాన్ని ఎంతోకాలం నడపలేమన్న విషయం సీఎం జగన్కు అర్థమైందన్నారు.
- IPS transfers: రాష్ట్రంలో ఐపీఎస్ల బదిలీ.. ఎవరెవరు ఎక్కడికి..!
రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్, జూనియర్ స్థాయిలో అధికారులను బదిలీ చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. డీజీపీ కార్యాలయంలో ఐజీపీ హోదాలో పని చేస్తున్న ఎల్ కే వి రంగారావుకు పోలీసు సంక్షేమం, క్రీడల విభాగం ఐజీపీగా నియమించారు. అదనపు డీజీ రైల్వే విభాగం అదనపు బాధ్యతలనూ అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చారు.
- ఈ దశాబ్దం చివరి నాటికి '6జీ' సేవలు: ప్రధాని మోదీ
దేశంలో ఈ దశాబ్దం చివరి నాటికి 6జీ నెట్వర్క్ సేవలను అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు ప్రధాని మోదీ. ఆన్లైన్ వేదికగా జరిగిన దిల్లీలోని ట్రాయ్ రజతోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు.
- జ్ఞాన్వాపి కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. సర్వే నివేదిక ఆలస్యం!
జ్ఞాన్వాపి మసీదులో శివలింగం దొరికిందంటున్న ప్రాంతానికి రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు వారణాసి జిల్లా మేజిస్ట్రేట్కు ఆదేశాలు జారీ చేసింది. మసీదులో సర్వేపై వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై యూపీ ప్రభుత్వానికి నోటీసులు పంపింది సుప్రీం.
- గుడ్న్యూస్.. ఇక 6 నెలల్లోనే గ్రీన్కార్డ్కు క్లియరెన్స్!
గ్రీన్ కార్డ్ జారీని వేగవంతం చేసేలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు కీలక సిఫార్సు చేసేందుకు.. ఈ అంశంపై ఏర్పాటైన సలహా మండలి సిద్ధమైంది. గ్రీన్ కార్డ్ దరఖాస్తులన్నింటిపై ఆరు నెలల్లోగా నిర్ణయం తీసుకునేలా నిబంధనలు సవరించేలా ప్రతిపాదించాలని ఆ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది.
- క్యూ4లో ఎయిర్టెల్ జోరు- ఐఓసీకి తగ్గిన లాభం.. కానీ!
నాలుగో త్రైమాసికంలో భారతీ ఎయిర్టెల్ ఏకీకృత నికర లాభం రెండు రెట్లు పెరిగి.. రూ.2008 కోట్లు నమోదుచేసింది. గతేడాది ఇదే క్వార్టర్లో నికర లాభం రూ.759 కోట్లుగా ఉంది. మరోవైపు, ఐఓసీ 31.4 శాతం నష్టాలను నమోదుచేసింది.
- సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న గబ్బర్.. ప్రముఖ బాలీవుడ్ బ్యానర్లో!
టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ కొత్త వృత్తిలోకి అడుగుపెడుతున్నాడు. ప్రముఖ బాలీవుడ్ బ్యానర్లో నటుడిగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ కూడా ఇప్పటికే పూర్తయిందని సమాచారం.
- పూజాతో వెంకీ, వరుణ్ చిందులు.. 'సలార్', 'మేజర్' అప్డేట్స్
కొత్త సినిమా అప్డేట్స్ వచ్చాయి. ఇందులో ప్రభాస్, వెంకటేశ్, వరుణ్, విజయ్సేతుపతి, అడివిశేష్, మోహన్బాబు చిత్రాల సంగతులు ఉన్నాయి. ఆ వివరాలు..