ETV Bharat / city

తెలంగాణ: కొత్తగా 5,695 కరోనా కేసులు... 49 మంది మృతి

author img

By

Published : May 3, 2021, 11:36 AM IST

తెలంగాణలో కొత్తగా 5,695 కరోనా కేసులు నమోదు కాగా.. 49 మంది మరణించారు. 6,206 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో క్రియాశీల కేసులు 80 వేలు దాటాయి.

corona cases
కరోనా కేసులు

తెలంగాణ కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. కొత్తగా 5,695 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా... కొవిడ్‌ బారిన పడి మరో 49 మంది మృతిచెందారు. 58,742 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా... తాజా కేసులు నమోదయ్యాయి.

కరోనా నుంచి మరో 6,206 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో క్రియాశీల కేసులు 80 వేలు దాటాయి. ప్రస్తుతం 80,135 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్​ఎంసీలో కొత్తగా 1,352, మేడ్చల్‌ జిల్లాలో 427, రంగారెడ్డి జిల్లాలో 483 కరోనా కేసులు వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.

ఇదీ చూడండి: తండ్రికి కరోనా.. ప్రేమ ఆగునా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.