ETV Bharat / city

కొత్తగా 44 కరోనా పాజిటివ్ కేసులు.. ఒకరు మృతి

author img

By

Published : Apr 19, 2020, 11:20 AM IST

Updated : Apr 19, 2020, 11:39 AM IST

corona cases
corona cases

11:16 April 19

44-new-corona-cases-conformed- in- andhrapradesh
హెల్త్ బులెటిన్

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 647కు చేరింది. ఒక్క కర్నూలు జిల్లాలోనే కొత్తగా 26 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. కృష్ణా జిల్లాలో 6,  తూర్పు గోదావరి జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 3,  అనంతపురం జిల్లాలో 3 కొత్త కేసులు నిర్థరణ అయినట్లు హైల్త్​ బులెటిన్​లో ప్రకటించింది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 565 మంది చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. కర్నూలు జిల్లాలో కొవిడ్​తో ఒకరు మరణించారని... రాష్ట్రవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 17కు చేరినట్లు వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 23 మంది వైరస్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది.

ఇదీ చదవండి:

నిరాశపరిచిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి!

Last Updated : Apr 19, 2020, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.