ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 3 PM

author img

By

Published : May 26, 2022, 2:58 PM IST

Updated : May 26, 2022, 3:18 PM IST

..

3PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 3 PM

  • Chandrababu on way to ongole: ఒంగోలు బయల్దేరిన చంద్రబాబు.. నేడు సాయంత్రం పొలిట్​బ్యూరో సమావేశం
    Chandrababu on way to ongole: తెదేపా అధినేత చంద్రబాబు.. ఒంగోలులో జరగనున్న మహానాడుకు బయల్దేరారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం నుంచి నేతలు, కార్యకర్తలతో కలిసి.. ర్యాలీగా తరలివెళ్లారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రోడ్డుపై దుకాణాలను తొలగించిన సిబ్బంది.. దాడి చేసిన వ్యాపారులు!
    Attack on VMC Staff: రోడ్డుకు అడ్డంగా దుకాణాలు పెట్టి ట్రాఫిక్​కు అంతరాయం కలిగిస్తున్నారంటూ ఫిర్యాదులు అందాయి. దీంతో.. వాటిని తొలగింపు చేపట్టిన సిబ్బందిపై వ్యాపారస్తులు దాడి చేశారు. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తెలంగాణలో పోలీస్ ప్రాథమిక రాతపరీక్ష ఎప్పుడంటే..?
    Police Preliminary Examination: తెలంగాణలో భారీఎత్తున పోలీస్​ పోస్టులను భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. పోలీస్‌ నియామకాల్లో కీలకమైన ప్రాథమిక రాతపరీక్షను ఆగస్టులో నిర్వహించేందుకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ సన్నాహాలు చేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పల్నాడు జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో రెండేళ్ల బాలుడు మృతి..!
    DIED: పల్నాడు జిల్లా రావిపాడులో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్​షార్ట్ సర్క్యూట్​తో ఇల్లు దగ్ధమై రెండేళ్ల బాలుడు సజీవదహనమైయ్యాడు. మృతి చెందిన బాలుడిని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రెండు ఏనుగుల భీకర ఫైట్.. దంతం విరిగినా...
    ఉత్తరాఖండ్​ హరిద్వార్​లోని శ్యామ్​పుర్​ అటవీ రేంజ్​లో రెండు గజరాజులు భీకరంగా ఘర్షణ పడుతున్న వీడియో వైరల్​గా మారింది. గత 2-3 రోజులుగా ఈ ఏనుగులు ఇలా గొడవ పడుతున్నాయని, ఒక గజరాజు దంతం విరిగిపోయిందని స్థానికులు చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • జైల్లో సిద్ధూకు క్లర్క్‌ ఉద్యోగం.. జీతం ఎంతో తెలుసా?
    Navjot singh sidhu clerk job: మూడు దశాబ్దాల క్రితం ఓ వృద్ధుడిపై దాడి చేసి అతడి మరణానికి కారణమైన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సిద్ధూ.. అక్కడ క్లెర్క్​ ఉద్యోగం చేయనున్నారు. మూడు నెలల పాటు ట్రైనీగా పరిగణిస్తామని ఆ తర్వాత రోజుకు రూ.40 నుంచి రూ.90 మధ్య జీతం అందిస్తామని అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కాంగ్రెస్​ నేతలపై సీబీఐ.. శివసైనికులపై ఈడీ.. దేశవ్యాప్తంగా కేంద్ర సంస్థల సోదాలు
    దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు తనిఖీలు చేపట్టాయి. మహారాష్ట్ర మంత్రి, శివసేన నేత పరాబ్​ నివాసంపై ఈడీ దాడులు చేపట్టింది. కర్ణాటక కాంగ్రెస్​ నేత డీకే శివకుమార్​పై ఛార్జ్​షీట్​ దాఖలు చేసింది. మరోవైపు ఝార్ఖండ్​ మాజీ మంత్రికి చెందిన నివాసం, కార్యాలయాలపై సీబీఐ దాడులు చేపట్టింది. చైనీయులకు వీసా కేసులో కార్తీ చిదంబరాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వాహనదారులకు బ్యాడ్ న్యూస్​.. థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ ప్రీమియం పెంపు
    third party insurance: థర్డ్​ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్​ ప్రీమియం ధరలను స్వల్పంగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ. పెరిగిన ధరలు జూన్ 1న అమల్లోకి వస్తాయని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఐపీఎల్​లో కేఎల్ రాహుల్ సరికొత్త రికార్డు
    IPL 2022: ఐపీఎల్​లో అరుదైన రికార్డు సాధించాడు లఖ్​నవూ సూపర్​జెయింట్స్​ కెప్టెన్ కేఎల్​ రాహుల్​. నాలుగు సీజన్లలో 600కుపైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వారితో డేటింగ్ చేసినప్పుడు​ భయంకరంగా ఉండేది : శృతి హాసన్​
    టాలీవుడ్​ టు బాలీవుడ్​లో వరస ​సినిమాలతో స్టార్​ హీరోయిన్​ శృతి హాసన్​ బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆమె చేసిన కామెంట్స్​ చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ, సహజీవనం విషయాలపై ఆసక్తికరమైన కామెంట్స్​ చేశారు. ఆమె తల్లిదండ్రులు కమల్​-సారిక విడాకులపై కూడా స్పందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
Last Updated : May 26, 2022, 3:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.