ETV Bharat / city

Corona cases today: రాష్ట్రంలో కొత్తగా 3,166 కరోనా కేసులు... 21 మరణాలు

author img

By

Published : Jul 7, 2021, 4:57 PM IST

రాష్ట్రంలో తాజాగా మరో 3,166 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి కారణంగా 21 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 32,356 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

రాష్ట్రంలో కొత్తగా 3,166 కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 3,166 కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 83,885 మంది నమూనాలు పరీక్షించగా 3,166 కొత్త కేసులు నమోదయ్యాయి. 21 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 4,019 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 32,356 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది.

కొవిడ్‌ వల్ల చిత్తూరు జిల్లాలో నలుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, కర్నూలులో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, శ్రీకాకుళంలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు మృతి చెందారు.

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు...

ఇదీ చదవండి:

కేంద్ర మంత్రిత్వ శాఖల్లోనూ భారీ మార్పులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.