ETV Bharat / city

AP CORONA CASES: రాష్ట్రంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

author img

By

Published : Aug 4, 2021, 5:40 PM IST

Updated : Aug 4, 2021, 7:00 PM IST

రాష్ట్రంలో కొత్తగా 2 వేల 442 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మరి కారణంగా 16 మంది మృతి చెందారు.

AP CORONA CASES
AP CORONA CASES

రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 85,822 మంది నమూనాలు పరీక్షించగా 2,442 కొత్త కేసులు నమోదయ్యాయి. 16 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 2,412 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 20,184 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది.

కొవిడ్‌ వల్ల చిత్తూరు జిల్లాలో ఐదుగురు, అనంతపురం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, తూర్పుగోదావరి, గుంటూరు, కడప, కర్నూలు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు.

ఇదీ చదవండి:

'ఈ నెల 24న అగ్రిగోల్డ్​ బాధితుల ఖాతాల్లో నగదు జమ'

Last Updated :Aug 4, 2021, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.