ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు@1PM

author img

By

Published : Dec 27, 2021, 1:00 PM IST

1PM top news
ప్రధాన వార్తలు@1PM

.

  • పవర్ లిఫ్టర్ సాధియాకు నారా లోకేష్ అభినందనలు
    అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తా చాటి స్వర్ణ పథకం సాధించిన సాధియాను నారా లోకేశ్ అభినందించారు. తనకు చేతనైనా సాయం చేస్తానని హామీ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రముఖ హాస్యనటుడు అలీకి జీవిత సాఫల్య పురస్కారం
    ప్రముఖ హాస్య నటుడు అలీని జీవిత సాఫల్య పురస్కారం వరించింది. తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. సినీనటి పి. శివపార్వతికి వెంకటేశ్వర గుప్త పురస్కారం లభించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఏ నిమిషానికి.. ఏమి ఊడునో.. ఆర్టీసీ బస్సులో!
    ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు అన్నాడో సినీ కవి. ప్రస్తుత ఆర్టీసీ బస్సులోని పరిస్థితి చూస్తే... ఏ నిమిషానికి ఏమి ఊడునో ఎవరూహించెదరు... అంటున్నారు ఆర్టీసీ ప్రయాణికులు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఛత్తీస్​గఢ్​ సరిహద్దుల్లో ఎన్​కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి
    తెలంగాణ - ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో కాల్పులు కలకలం సృష్టించాయి. బీజాపూర్​ జిల్లాలో తెలంగాణ గ్రేహైండ్స్​, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రెండు రైళ్లలో అగ్నిప్రమాదం- దగ్ధమైన బోగీలు
    కాసగంజ్​ ప్యాసింజర్​ రైలు జనరల్​ బోగీలో ఆదివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన ప్రయాణికులు రైలు నుంచి దూకడం వల్ల ప్రాణాపాయం తప్పింది. ఉత్తర్​ప్రదేశ్​ ఫరుఖాబాద్​ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బాలిక​పై మైనర్ల సామూహిక అత్యాచారం- మూడు నెలల పాటు..
    ఓ బాలికపై కొందరు మైనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన జరిగిన ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. మూడు నెలల పాటు వారు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ వ్యవహారంలో పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఎస్పీ నేత పీయూష్ జైన్ అరెస్టు- మరో రూ.10 కోట్లు సీజ్
    ఉత్తర్​ప్రదేశ్ వ్యాపారి పీయూష్ జైన్ ఇళ్లు, ఫ్యాక్టరీల నుంచి మరో రూ.10 కోట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బ్రెజిల్​లో భారీ వరదలు-18 మంది మృతి
    బ్రెజిల్‌ను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా దేశంలో 18 మంది చనిపోయారు. మరో 280 మందికిపైగా గాయపడ్డారు. 35 వేల మంది ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రాహుల్ మరో ఘనత.. పుజారా చెత్త రికార్డు
    దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీతో అదరగొట్టాడు టీమ్ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్. ఈ క్రమంలోనే ఓ రికార్డును నెలకొల్పాడు. ఇక ఈ మ్యాచ్​లో డకౌట్​గా వెనుదిగిరిన పుజారా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'టైగర్​ బతికే ఉన్నాడు.. పాము కూడా బతికే ఉంది'
    బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్​ను పాము కరిచిందనే వార్త అభిమానులను కలవరపాటుకు గురిచేసింది. అయితే తాను క్షేమంగా ఉన్నానని, ఎలాంటి సమస్య లేదని చెప్పారు సల్మాన్. పామును చంపలేదని, దానితో దోస్తీ కుదుర్చుకున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.