ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 154 మందికి కరోనా

author img

By

Published : Jun 8, 2020, 1:37 PM IST

Updated : Jun 8, 2020, 2:00 PM IST

154-more-corona-cases-listed-in-ap
154-more-corona-cases-listed-in-ap

13:30 June 08

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి

రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు అనంతరం కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 154 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. 

మొత్తం కేసుల సంఖ్య 4813కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన కేసులు 28 ఉండగా.. విదేశాల నుంచి వచ్చిన వారికి సంబంధించి ఒక్క కేసు నమోదయ్యింది. తాజాగా 34 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా.. డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2387కి చేరింది. ఇప్పటి వరకూ 75 మంది ప్రాణాలు కోల్పోయారు. 

ఇదీ చదవండి

సీఎంకు గొంతునొప్పి- మంగళవారం కరోనా టెస్ట్

Last Updated : Jun 8, 2020, 2:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.