ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 11 AM

author img

By

Published : Apr 21, 2022, 11:01 AM IST

11AM TOP NEWS
ప్రధాన వార్తలు @ 11 AM

..

  • సీఎం జగన్​ పర్యటన దృష్ట్యా.. తెదేపా నేతల గృహ నిర్బంధం
    Jagan Tour: తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్​ పర్యటన దృష్ట్యా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. తెదేపా నేత రామకృష్ణారెడ్డితో పాటు కార్యకర్తలు, జనసేన నేతలను గృహనిర్బంధం చేశారు. బలభద్రపురంలో గ్రాసిమ్‌ పరిశ్రమ ప్రారంభోత్సవం వద్ద 400 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కారు స్వాధీనంపై సీఎం కార్యాలయం ఆరా.. వాహనం తీసుకెళ్లాలని సూచన
    CMO: ఒంగోలులో పోలీసుల ఓవరాక్షన్​పై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. పూర్తి వివరాలు సేకరించి.. కారు తీసుకెళ్లాలని డ్రైవర్​కు సూచించినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రాష్ట్రంలో దౌర్భాగ్యపు పాలనకు ఇదే నిదర్శనం: చంద్రబాబు
    CBN On Ongole Incident: ఒంగోలులో కారు స్వాధీనం ఘటనపై ప్రతిపక్ష నేత, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రాష్ట్రంలో దౌర్భాగ్యపు పాలనకు ఇదే నిదర్శనమని దుయ్యబట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం.. రూ.7.76 లక్షల కోట్లకు చేరిన చెల్లింపుల భారం
    Financial Crisis in Andhra Pradesh: ముఖ్యమంత్రిగా ముప్ఫై సంవత్సరాలు రాజ్యం చేయడమే తన ‘బలమైన కోరిక’గా చెప్పుకొన్న జగన్మోహనరెడ్డి- మూడేళ్లలోనే ఆంధ్రప్రదేశ్‌ను దివాలా అంచులకు ఈడ్చుకుపోయారు. ఆర్థిక కార్యకలాపాల్లో జవాబుదారీతనానికి సమాధి కడుతున్న ఆయన సర్కారు- మార్చి నెలాఖరు నాటికి రాష్ట్రంపై మొత్తం చెల్లింపుల భారాన్ని రూ.7.76 లక్షల కోట్లకు చేర్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ప్రేమ కోసం పురుషుడిలా మారిన మహిళ.. చివరకు ఏమైందంటే?
    Women Changs Gender For Love: తమిళనాడు మదురైలో ఓ అరుదైన ఘటన జరిగింది. ప్రేమిస్తున్నాని చెప్పి ఒక మహిళ.. మరో మహిళను బలవంతంగా పురుషుడిగా మారేలా చేసి.. ఆపై మోసగించింది. దీంతో పురుషుడిగా మారిన అతడు పోలీసులను ఆశ్రయించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారత్​ చేరుకున్న బ్రిటన్​ ప్రధాని.. గుజరాత్​లో ఘన స్వాగతం
    Boris Johnson India Visit: బ్రిటన్​ ప్రధానమంత్రి బోరిస్​ జాన్సన్ భారత్​ చేరుకున్నారు. గుజరాత్​ విమానాశ్రయంలో దిగిన ఆయనకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఘన స్వాగతం పలికారు. బోరిస్ భారత్​లో రెండు రోజుల పాటు​ పర్యటిస్తారు. దీని వల్ల ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక రక్షణ, వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
    Corona Cases: దేశంలో కొత్తగా 2,380 కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో 56 మంది వైరస్​కు బలయ్యారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజులోనే 9లక్షలకుపైగా కొత్త కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'నాటోలో చేరొద్దు'.. ఆ దేశాలకు రష్యా స్ట్రాంగ్​ వార్నింగ్​!
    Russia Ukraine Crisis: స్వీడన్​, ఫిన్లాండ్​లను నాటోలో చేరవద్దని బహిరంగంగా, దౌత్య మార్గాల ద్వారా హెచ్చరించినట్లు రష్యా విదేశాంగశాఖ ప్రతినిధి మారియా జఖరోవా బుధవారం వెల్లడించారు. మరోవైపు రష్యాతో గల అత్యంత ప్రాధాన్య దేశం హోదాను జపాన్​ పార్లమెంట్​ రద్దు చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • David Warner: వార్నర్ అరుదైన రికార్డు.. రోహిత్​ తర్వాత అతడే
    David Warner: ఐపీఎల్​లో అరుదైన రికార్డు సాధించాడు దిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్. ఒకే జట్టుపై వెయ్యికి పైగా పరుగులు చేసిన రెండో బ్యాటర్​గా ఘనత దక్కించుకున్నాడు. ఈ జాబితాలో ముంబయి సారథి రోహిత్ శర్మ అతడి కన్నా ముందున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఫ్యాన్స్​కు సారీ.. ఆ యాడ్​ నుంచి తప్పుకున్న అక్షయ్
    బాలీవుడ్​ స్టార్​ హీరో అక్షయ్​కుమార్..​ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. తాను ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ఓ పొగాకు ఉత్పత్తి సంస్థ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.