ETV Bharat / business

40 కోట్ల ట్విట్టర్ యూజర్ల ​డేటా చోరీ.. సుందర్ పిచాయ్, డబ్ల్యూహెచ్​ఓ సహా..

author img

By

Published : Dec 26, 2022, 4:01 PM IST

Updated : Dec 26, 2022, 4:37 PM IST

ట్విట్టర్​కు సంబంధించిన 40 కోట్ల మంది వినియోగదారుల డేటాను చోరీ చేసినట్లు హ్యాకర్​ తెలిపాడు. ట్విట్టర్​ తన నుంచి ఈ డేటాను కొనుకోలు చేయవచ్చని చెప్పాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెలీ సైబర్ సంస్థ హడ్సన్ రాక్ వెల్లడించింది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్​, డబ్ల్యూహెచ్​వో, కేంద్ర సమాచారం మంత్రిత్వ శాఖ ట్విట్టర్ డేటా చోరీకి గురైనట్లు పేర్కొంది. మరోవైపు ట్విట్టర్​ సీఈఓగా బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్నానని ఇండో అమెరికన్ వీ.ఏ అయ్యాదురై తెలిపారు.

Twitter Data Breach
ట్విట్టర్

Twitter Data Breach : ఎలాన్ మస్క్​ నేతృత్వంలో ట్విట్టర్​కు మరో ఎదురుదెబ్బ తగిలింది. 40 కోట్ల మంది ట్విట్టర్ వినియోగదారుల​ డేటాను దొంగిలించి డార్క్ వెబ్​లో అమ్మకానికి పెట్టినట్లు హ్యాకర్ ప్రకటించాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెలీ సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ హడ్సన్ రాక్ వెల్లడించింది. ఇందులో ప్రముఖల ఈ-మెయిల్స్, ఫోన్ నంబర్లు సైతం ఉన్నాయని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ), కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్​, అమెరికన్ సింగర్ చార్లీ పుత్ తదితరుల సమాచారం చోరీకి గురైందని హడ్సక్ రాక్​ సంస్థ పేర్కొంది. అలాగే హ్యాకర్​ షేర్ చేసిన చిత్రాలను పోస్ట్ చేసింది.

"నేను 40 కోట్ల మంది ట్విట్టర్ వినియోగదారుల డేటాను విక్రయిస్తున్నాను. ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ నేను పెట్టిన ఈ పోస్ట్​ను చదువుతున్నట్లయితే ఒక ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకు రావాలి. ఈ డేటాను కొనేందుకు ముందుకు రావాలి. ఇప్పటికే ట్విట్టర్​కు 54 లక్షల మంది డేటా లీక్​ వల్ల జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్(జీడీపీఆర్​) చట్టం ప్రకారం భారీ జరిమానా పడే అవకాశం ఉంది. మళ్లీ 40 కోట్ల మంది డేటా లీక్​ వల్ల 2.77 మిలియన్ డాలర్ల జరిమానా పడుతుంది. ఫేస్​బుక్ అంతకుముందు ఈ చట్టం ఉల్లంఘన వల్ల జరిమానా చెల్లించింది. అలా కాకుండా మీరే 40 కోట్ల మంది డేటాను కొనుగోలు చేయండి. ఇంకెవరికీ ట్విట్టర్​ డేటాను విక్రయించను."

--హ్యాకర్​

అవకాశం వస్తే ట్విట్టర్ బాధ్యతలు చేపడతా..
ట్విట్టర్ సీఈఓగా వైదొలుగుతున్నానని కొద్దిరోజుల క్రితం ఎలాన్ మస్క్ ప్రకటించారు. తదుపరి సీఈఓ వచ్చేంతవరకు ఈ బాధ్యతల్లో కొనసాగుతానని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ సీఈఓగా బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్ధమని ఇండో-అమెరికన్ వి.ఎ శివ అయ్యదురై తెలిపారు. అయ్యదురై.. మహారాష్ట్రలోని ముంబయిలో జన్మించారు. 1978లో ఈమెయిల్ పేరిట ఓ కంప్యూటర్ ప్రోగ్రామ్​ను రూపొందించారు. 1982లో ఈయనకు అమెరికా ప్రభుత్వం ఈ-మెయిల్ తొలి కాపీరైట్​ను ఇచ్చింది. తద్వారా అయ్యదురై ఈ-మెయిల్ సృష్టికర్తగా పేరు గాంచారు.

Twitter Data Breach
ఇండో- అమెరికన్ శివ అయ్యదురై

'నాకు ట్విట్టర్ సీఈఓ పదవిపై ఆసక్తి ఉంది. మసాచుసెట్స్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి నాలుగు డిగ్రీలు సంపాదించాను. ఏడు విజయవంతమైన హైటెక్ సాఫ్ట్​వేర్​లను రూపొందించాను. సీఈఓ పదవి కోసం దరఖాస్తు చేసే ప్రక్రియ గురించి దయచేసి సలహా ఇవ్వండి'

--మస్క్​ను ట్యాగ్ చేస్తూ అయ్యదురై చేసిన ట్వీట్

Last Updated :Dec 26, 2022, 4:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.