ETV Bharat / budget-2019

రాష్ట్ర బడ్జెట్​లో ముఖ్యాంశాలు ఇవే

author img

By

Published : Jul 12, 2019, 2:53 PM IST

Updated : Jul 12, 2019, 3:09 PM IST

ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2019-20లో కేటాయింపుల్లో ముఖ్యమైన అంశాలు ఇవే. అన్ని వర్గాలకు సంబంధించి సమాచారం ఈ స్టోరీలో చూడొచ్చు.

రాష్ట్ర బడ్జెట్​లో మీరు తెలుసుకోవాలసిన ముఖ్యాంశాలు ఇవే

ముఖ్యమైన పథకాలు.. కేటాయింపులు

2019-20 బడ్జెట్ మొత్తం 2,27,974.99 కోట్లు. మానిఫెస్టో, పాదయాత్ర హామీలపై ప్రత్యేక దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం... వ్యవసాయం, విద్య, సంక్షేమానికి భారీ కేటాయింపులు చేస్తున్నట్టు బడ్జెట్​లో తెలిపింది.


రైతులకు...

  • వైఎస్ఆర్ రైతు భరోసా- రూ. 8,750 కోట్లు
  • వైఎస్ఆర్ 9 గంటల ఉచిత విద్యుత్- రూ. 4,560 కోట్లు
  • రైతులకు వైఎస్ఆర్ సున్నావడ్డీ రుణాలు- రూ. 100 కోట్లు
  • ధరల స్థిరీకరణ నిధి- రూ. 3,000 కోట్లు
  • ప్రకృతి వైపరీత్యాల నిధి- రూ. 2,002.08 కోట్లు
  • వైఎస్ఆర్-పీఎం ఫసల్ బీమా యోజన- రూ. 1163 కోట్లు
  • ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కోసం- రూ. 475 కోట్లు
  • రైతులకు ఉచిత బోర్లు -రూ. 200 కోట్లు
  • రైతు విత్తనాల కోసం -రూ. 200 కోట్లు
  • వేర్ హోసింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్- రూ. 200 కోట్లు
  • వైఎస్ఆర్- అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్- రూ. 109. 28 కోట్లు
  • ఫామ్ మెకనైజేషన్- రూ. 100. 05 కోట్లు
  • రైతులు మరణిస్తే.. నష్ట పరిహారం- రూ 100 కోట్లు
  • సహకార డైరీల బలోపేతం కోసం- రూ. 100 కోట్లు
  • పశు గ్రాసం, దాణా కోసం- రూ. 100 కోట్లు
  • గోదాముల నిర్మాణం కోసం- రూ. 37. 54 కోట్లు

మత్స్యకారులకు...

  • జెట్టీలు, హార్బర్ల నిర్మాణాల కోసం- రూ. 100 కోట్లు
  • మత్స్యకారుల బోట్లకు డీజిల్ సబ్సిడీ కోసంః రూ. 100 కోట్లు
  • మత్స్యకారుల అభివృద్ధికి- రూ. 100 కోట్లు
  • షెడ్యూలు కులాల మత్స్యకారుల సంక్షేమానికి- రూ. 50 కోట్లు

విద్యార్థులకు...

  • జగనన్న అమ్మఒడి- రూ. 6,455.80 కోట్లు
  • పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు -రూ. 1500 కోట్లు
  • మధ్యాహ్న భోజన పథకానికి -రూ. 1077 కోట్లు
  • వైఎస్ఆర్- పాఠశాల నిర్వహణ నిధి- రూ. 160 కోట్లు
  • వంటశాలల నిర్మాణం కోసం(అక్షయపాత్ర)- రూ. 100 కోట్లు

వైద్యారోగ్యానికి...

  • డా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ- రూ. 1740 కోట్లు
  • ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలకు-రూ. 1500 కోట్లు
  • ఆశా వర్కర్ల గౌరవ వేతనం కోసం- రూ. 455.85 కోట్లు
  • వైద్య భవనాల కోసం- రూ. 68 కోట్లు
  • డా. వైఎస్ఆర్ గిరిజన వైద్య కళాశాల-రూ. 66 కోట్లు
  • గురజాలలో ప్రభుత్వ వైద్యకళాశాల-రూ. 66 కోట్లు
  • విజయనగరంలో ప్రభుత్వ వైద్యకళాశాల-రూ. 66 కోట్లు
  • పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఆసుపత్రి కోసం- రూ. 50 కోట్లు
  • రాష్ట్ర క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ కోసం- రూ. 43.60 కోట్లు

గృహనిర్మాణానికి...

  • గృహ నిర్మాణం కోసం మొత్తం- రూ.9,785.75 కోట్లు
  • వైఎస్ఆర్ గృహ వసతి- రూ. 5000 కోట్లు
  1. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(అర్బన్)- రూ. 1370 కోట్లు
  2. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్)
  3. వైఎస్ఆర్ బలహీనవర్గాల గృహ నిర్మాణం కోసం- రూ. 1280.29 కోట్లు
  4. వైఎస్ఆర్ అర్బన్ హౌసింగ్ - రూ. 1000 కోట్లు
  5. ప్రధానమంత్రి ఆవాస యోజన(గ్రామీణ)- రూ. 565.25 కోట్లు
  6. బలహీన వర్గాల ఇళ్ళ నిర్మాణం కోసం- రూ. 150.21

పింఛన్ కోసం...

  • వైఎస్ఆర్ పింఛన్ల కోసం- రూ. 15,813.51 కోట్లు
  • వైఎస్ఆర్ పింఛన్ కానుక వృద్ధులు, వితంతువులు కోసం- రూ. 12801.04 కోట్లు
  • దివ్యాంగుల పింఛన్ కానుక కోసం- రూ. 2133.62 కోట్లు
  • ఒంటరి మహిళల పింఛన్ కానుక కోసం- రూ. 300 కోట్లు
  • మత్స్యకారుల పింఛన్ కానుక కోసం- రూ. 130 కోట్లు
  • ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పింఛన్ల కోసం- రూ. 100.20 కోట్లు
  • కిడ్నీ డయాలసిస్ రోగుల పింఛన్ కోసం- రూ. 85 కోట్లు
  • కల్లు గీత కార్మికుల పింఛన్ కోసం- రూ. 78.85 కోట్లు
  • వైఎస్ఆర్ అభయ హస్తం పింఛన్ కోసం- రూ. 90.88 కోట్లు
  • ట్రాన్స్ జెండర్ల పింఛన్ కోసం- రూ. 7 కోట్లు

ప్రభుత్వం చదివించే కల్యాణ కానుకులు ఏంటేంటే...

  • బీసీల కోసం వైఎస్ఆర్ కల్యాణ కానుక- రూ. 300 కోట్లు
  • ఎస్సీల కోసం వైఎస్ఆర్ కల్యాణ కానుక- రూ. 200 కోట్లు
  • వైఎస్ఆర్ గిరి పుత్రిక కల్యాణ పథకం(ఎస్టీ)- రూ. 40 కోట్లు
  • వైఎస్ఆర్ షాదీ క తోఫా(మైనార్టీ)- రూ. 100 కోట్లు
  • వైఎస్ఆర్ కళ్యాణ కానుక(ఇంటర్ క్యాస్ట్)- రూ. 36 కోట్లు
  • వైఎస్ఆర్ కళ్యాణ కానుక(ఇంటర్ క్యాస్ట్)- రూ. 5 కోట్లు

వివిధ వర్గాలకు ఇచ్చే ఆర్థిక భరోసా కోసం,,

  • కాపు సంక్షేమం కోసం- రూ. 2000 కోట్లు
  • అగ్రిగోల్డ్ బాధితుల కోసం- రూ. 1150 కోట్లు
  • వైఎస్ఆర్ బీమా- రూ. 404.02 కోట్లు
  • ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం- రూ. 400 కోట్లు
  • నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్స్ కు వైఎస్ఆర్ ఆర్థిక సాయం- రూ. 300 కోట్లు
  • చేనేతలకు వైఎస్ఆర్ ఆర్థిక సాయం- రూ. 200 కోట్లు
  • ధార్మిక సంస్థలకు వైఎస్ఆర్ గ్రాంట్స్- రూ. 234 కోట్లు
  • బ్రాహ్మణ సంక్షేమ కార్పోరేషన్- రూ. 100 కోట్లు
  • లాయర్ల సంక్షేమం కోసం, ట్రస్టు ఏర్పాటు- రూ. 100 కోట్లు
  • లాయర్లకు సాయం- రూ. 10 కోట్లు
  • సబ్సిడీ బియ్యం కోసం- రూ. 3000 కోట్లు
  • రైస్ ప్యాకెట్ల తయారీ కోసం- రూ. 750 కోట్లు
  • సివిల్ సప్లయిస్ కార్పోరేషన్ కోసం- 384 కోట్లు

పల్లె, పుర పాలనకు నిధులు ఎంతంటే...

  • గ్రామ వాలంటీర్ల కోసం- రూ. 720 కోట్లు
  • గ్రామ సచివాలయాలకు- రూ. 700 కోట్లు
  • మున్సిపల్ వార్డు వాలంటీర్లకు- రూ. 280 కోట్లు
  • మున్సిపల్ సచివాలయాల కోసం- రూ. 180 కోట్లు
  • పంచాయితీరాజ్ రోడ్ల నిర్మాణం కోసం- రూ. 376.35 కోట్లు
  • పంచాయితీరాజ్ రోడ్ల కోసం- రూ. 350 కోట్లు
  • పంచాయితీరాజ్ రోడ్లు(ఆర్ఐడీఎఫ్)- రూ. 150 కోట్లు
  • పులివెందుల ప్రాంత డెవలప్ మెంట్ ఏజెన్సీ- రూ100 కోట్లు
  • అమరావతి- అనంతపురం నేషనల్ హైవే- రూ. 100 కోట్లు
  • క్యాపిటల్ రీజియన్ సోషల్ సెక్యూరిటీ ఫండ్- రూ. 65 కోట్లు
  • మున్సిపల్ ఎన్నికల కోసం- రూ. 60 కోట్లు
  • మంగళగిరిని మోడల్ పట్టణంగా అభివృద్ధి చేయటం కోసం- రూ. 50 కోట్లు
  • మున్సిపాల్టీలు, నగర పంచాయితీలు, కార్పోరేషన్లలో వ్యర్థాల నిర్వహణ కోసం- రూ. 50 కోట్లు
  • అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్ మెంట్ ప్రాజెక్టు కోసం- రూ. 50 కోట్లు

పరి'శ్రమ' ఎంతంటే?

  • ఏపీఐఐసీ కోసం- రూ. 360 కోట్లు
  • కడప స్టీల్ ప్లాంట్ కోసం- రూ. 250 కోట్లు
  • పరిశ్రమల ప్రోత్సాహకాల కోసం- రూ. 573.60 కోట్లు
  • పరిశ్రమల మౌలిక సదుపాయాల అభివృద్ధికి - రూ. 250 కోట్లు
  • ఎంఎస్ఎంఈస్ కోసం- రూ. 200 కోట్లు
  • ఎంఎస్ఎంఈస్ ఇన్సెంటీవ్స్ కోసం- రూ. 200 కోట్లు
  • కడప యాన్యుటీ ప్రాజెక్టుల కోసం- రూ. 120 కోట్లు
  • సీఐఐపీ కింద మౌలిక సదుపాయాల ఏర్పాట్ల కోసం - రూ 100 కోట్లు

రాజధాని, ఇతర నగరాలకు కేటాయింపుల పరిస్థితి ఏంటంటే?

  • ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కోసం -రూ. 700 కోట్లు
  • రాజధానిలో మౌలిక సదుపాయాల కోసం- రూ. 500 కోట్లు
  • విశాఖపట్నం- చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్ నిర్మాణం కోసం- రూ. 200 కోట్లు
  • స్మార్ట్ సిటీస్ నిర్మాణం కోసం- రూ. 150 కోట్లు
  • నూతన రైల్వే నిర్మాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం వాటా -రూ. 185 కోట్లు

మహిళలకు కేటాయింపులు సంగతేంటి

  • డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాల కోసం- రూ. 1140 కోట్లు
  • పట్టణాల్లోని స్వయం ఉపాధి సంఘాలకు వైఎస్ఆర్ ఉచిత రుణాలు - రూ. 648 కోట్లు

మిగిలిన కేటాయింపులు ఇలా...

  • సీఎం అభివృద్ధి నిధి- రూ. 500 కోట్లు
  • ఎన్జీఆర్ఈ కోసం- రూ. 500 కోట్లు
  • సీఎం కాల్ సెంటర్ - రూ. 73.33 కోట్లు
  • రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ- రూ. 71.90 కోట్లు
  • ఆర్టీసీకి మొత్తంగా ఆర్థిక సాయం- రూ. 1832 కోట్లు
Intro:ap_atp_57_12_jyothula_ustavam_av_ap10099
Date:12-07-2019
Center:penu konda
Contributor:c.a.naresh
Cell:9100020922
EMPID:AP10099
భక్తిశ్రద్దలతో తొలిఏకాదశి
తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకుని శుక్రవారం అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం కదిరేపల్లి గ్రామంలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జ్యోతులోత్సవం కనుల పండుగ లా నిర్వహించారు. ఉదయం గ్రామంలో ని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయం చుట్టూ ఎడ్ల బండ్లు ప్రదర్శన నిర్వహించారు. పూజల అనంతపురం ప్రజలందరికీ తీర్థప్రసాదాలు పంచిపెట్టారు.Body:ap_atp_57_12_jyothula_ustavam_av_ap10099Conclusion:9100020922
Last Updated : Jul 12, 2019, 3:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.