ETV Bharat / briefs

సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు బీడీఎల్ బాసట

author img

By

Published : Jul 3, 2019, 8:24 PM IST

సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు బీడీఎల్ బాసట..రూ.2 కోట్ల ఆర్థికసాయం

సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు బీడీఎల్ బాసట..రూ.2 కోట్ల ఆర్థికసాయం

వెనుకబడిన జిల్లాలను ఆర్థికంగా ఆదుకునే బాధ్యతను కేంద్రం కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించింది. వీటిలోభాగంగా విజయనగరం జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో వసతుల కల్పనకు కేంద్ర సంస్థ బీడీఎల్ నిధులు సమకూర్చనుంది.



విజయనగరం జిల్లాలోని సాంఘిక సంక్షేమ వ‌స‌తిగృహాల్లో మౌలిక వ‌స‌తుల క‌ల్పనకు ప్రభుత్వరంగ సంస్థ భార‌త్ డైన‌మిక్స్ లిమిటెడ్(బీడీఎల్​) ముందుకు వ‌చ్చింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్​ఆర్) కింద ఆ సంస్థ 2 కోట్ల రూపాయల నిధుల‌ను కేటాయించ‌నుంది. ఈ మేర‌కు క‌లెక్టర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్​ లాల్, బీడీఎల్ ప్రతినిధులతో అవ‌గాహ‌న ఒప్పందం చేసుకున్నారు. దీనికి సంబంధించిన దస్త్రాలపై బీడీఎల్‌ సంస్థ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ ఎస్‌.నారాయ‌ణ‌న్ ఆధ్వర్యంలో అధికారుల బృందం సభ్యులు క‌లెక్టర్ కార్యాల‌యంలో సంత‌కాలు చేశారు.

జిల్లాలో 11 సాంఘిక హాస్టళ్లలో వ‌స‌తుల మ‌ర‌మ్మతులు, స‌దుపాయాల‌ మెరుగుద‌ల‌కు ఈ నిధుల‌ను వినియోగించ‌నున్నట్టు క‌లెక్టర్ డా.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ తెలిపారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆయా జిల్లాల‌కు ప్రభుత్వ రంగ సంస్థలను జ‌త‌చేసి మౌలిక వ‌స‌తుల అభివృద్ధికి సీఎస్​ఆర్ నిధుల‌ు మంజూరు చేస్తోంద‌ని కలెక్టర్ తెలిపారు.

"భారత్ డైనమిక్స్ లిమిటెడ్ .. రక్షణ విభాగ పరికరాలను తయారు చేస్తోంది. కార్బొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా విజయనగరం జిల్లాను ఎంచుకున్నాం. మా సంస్థ నుంచి సీఎస్​ఆర్ నిధులను జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతిగృహాలకు అందించనున్నాం. ఆ మేరకు జిల్లా కలెక్టర్​తో అవగాహన ఒప్పందం చేసుకున్నాం"

- నారాయణన్, బీడీఎల్ సంస్థ జనరల్ మేనేజర్

ఇదీ చదవండి : వివేకా వాచ్​మన్​కు నార్కో అనాలసిస్ పరీక్షకు కోర్డు అనుమతి

ఏపీకి ప్రత్యేక హోదా పై మోడీ ప్రభుత్వ నిర్ణయం దుర్మార్గం అన్యాయం అని పిసిసి ఉపాధ్యక్షుడు నర్రెడ్డి తులసి రెడ్డి అన్నారు . యాంకర్ వాయిస్ : ఆంధ్రప్రదేశ్ సహా దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది ప్రతిపాదన లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కరాఖండిగా నిన్నటి రోజు పార్లమెంటులో లిఖిత పూర్వకంగా చెప్పడం శోచనీయం అన్యాయం ఇచ్చే ఆలోచన లేనప్పుడు బిజెపి మేనిఫెస్టోలో ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ఇస్తామని ఎందుకు చెప్పినట్లు. ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణ రాజస్థాన్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ బీహార్ జార్ఖండ్ రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా గా అడుగుతున్నాను అని చెప్పడం ప్రత్యేక హోదా అంశాన్ని పక్కదారి మళ్ళించడమే అని తులసి రెడ్డి అన్నారు. వైకాపా నాయకులు మాకు 25 ఎంపీలను ఇవ్వండి ప్రత్యేక హోదా ఎందుకు రాదో ఉత్తర కుమార ప్రగల్బాలు పలికిన వైకాపా నాయకుడు జగన్మోహన్రెడ్డి ఇప్పుడేమంటారు. అడుగుతూ ఉంటా ఉంటా మంటారు మీరు అడుగుతూ నే ఉంటారు వారి ఇచ్చేది లేదంటూనే ఉంటారు వైకాపా నాయకులకు జగన్ కు ప్రత్యేక హోదా పట్ల చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా గా లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తులసి రెడ్డి డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇస్తానన్న కాంగ్రెస్కు ఓట్లు వేయకుండా ప్రత్యేక హోదా తేవడం చేతగాని వైకాపాకు బిజెపికి ఓట్లు వేస్తే ఏమవుతుందో ప్రజలు ఇప్పటికైనా గ్రహించాలి ఏది ఏమైనప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా ఒక్క కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమని మరోసారి రుజువైంది అని రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షుడు న రెడ్డి తులసి రెడ్డి అన్నారు .
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.