ETV Bharat / bharat

ఘోర రోడ్డు ప్రమాదాలు.. 18 మంది దుర్మరణం

author img

By

Published : Jun 23, 2022, 8:18 AM IST

Updated : Jun 23, 2022, 9:19 AM IST

पीलीभीत में भीषण सड़क हादसे में 10 की मौत हो गई. वहीं, 7 लोग घायल हो गए. जिनमें 2 की हालत गंभीर बनी हुई है.

pilgrims died in Pilibhit Road Accident UP
pilgrims died in Pilibhit Road Accident UP

08:12 June 23

ఘోర రోడ్డు ప్రమాదాలు.. 18 మంది దుర్మరణం

Pilibhit Road Accident: ఉత్తర్​ప్రదేశ్​ పీలీభీత్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ డీసీఎం అదుపుతప్పి చెట్టును ఢీకొనగా.. 10 మంది యాత్రికులు మరణించారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గజ్రౌలా పోలీస్​ స్టేషన్​ పరిధిలో గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మొత్తం 18 మంది హరిద్వార్​లో స్నానం చేసి తిరిగివెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

అంతకుముందు బుధవారం సాయంత్రం.. యూపీలోనే హమీర్​పుర్​లో జరిగిన ఓ ప్రమాదంలో 8 మంది మృతిచెందారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. మౌదహా మాక్రావాన్​లోని జాతీయ రహదారి-34 వద్ద ఈ విషాదం జరిగింది. మామిడి పండ్ల లోడ్​తో వెళ్తున్న ఓ ట్రక్కు ఆటోను ఢీకొట్టింది. దీంతో మృతదేహాలు చెల్లాచెదురుగా రోడ్డుపై పడిపోయాయి. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్​ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: సోదరిని కత్తితో ఏడుసార్లు పొడిచిన సోదరుడు.. వీడియో వైరల్

భార్యను హత్య చేసి.. శవం పక్కనే నిద్ర.. కూతురు ఏడ్చిందని...

Last Updated :Jun 23, 2022, 9:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.