ETV Bharat / bharat

ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు చిన్నారులు సహా 9 మంది దుర్మరణం

author img

By

Published : Aug 25, 2022, 7:41 AM IST

Updated : Aug 25, 2022, 1:10 PM IST

Tumakuru Road Accident
Tumakuru Road Accident

07:33 August 25

ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు చిన్నారులు సహా 9 మంది దుర్మరణం

ఘోర రోడ్డు ప్రమాదం

Tumakuru Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుమకూరు జిల్లా శిరా తాలూకా బాలినహళ్లిలో లారీ, జీపు​ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని తుమకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని బెంగళూరులోని NIMHANS కు తరలించారు. గురువారం ఉదయం 4.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా రాయచూరు జిల్లాకు చెందిన వారని తెలిపారు పోలీసులు. ఘటనా సమయంలో జీప్​లో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాదానికి గురైన వారంతా రోజువారీ కూలీలు అని పోలీసులు వెల్లడించారు. బెంగళూరుకు వెళ్తుండగా ఘటన జరిగినట్లు వివరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తుమకూరు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి మోదీ పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున అందించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్​ బొమ్మై.

ఇవీ చూడండి: రోడ్డు పక్కన ఛాయ్​ తాగుతున్న వారిపైకి దూసుకొచ్చిన కారు

టిప్పర్ బైక్ ఢీ, ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి, అనాథగా మూడేళ్ల చిన్నారి

Last Updated : Aug 25, 2022, 1:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.