ETV Bharat / bharat

వంట సరకులతో 3 కి.మీ నడిచిన కలెక్టర్​, ఎమ్మెల్యే

author img

By

Published : Apr 4, 2020, 6:14 PM IST

ఓ జిల్లా కలెక్టర్​, ఎమ్మెల్యే నిత్యావసర సరకులు మోసుకుంటూ దట్టమైన అడవిలో 3 కిలోమీటర్లు నడిచారు. నది దాటి అవతలి గట్టున ఉన్న గిరిజన తండావాసులకు అవసరమైన సామగ్రి అందించి ఉదారత చాటారు. ఈ సంఘటన కేరళలోని పతనంతిట్ట జిల్లాలో చోటుచేసుకుంది.

District Collector and MLA trekked kilometres to carry rice and groceries to a tribal settlement
నిత్యవసర సరుకులు మోస్తూ 3కిలోమీటర్లు నడిచిన కలెక్టర్​, ఎమ్మెల్యే!

కరోనా వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్​డౌన్​తో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. నగరాల్లో ఉన్నవారికి కాస్తోకూస్తో అవసరమైన సరకులు లభిస్తున్నాయి. అయితే ఎక్కడో అడవి ప్రాంతంలో ప్రపంచానికి దూరంగా జీవించే గిరిజనులు నిత్యావసరాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన కేరళ పతనంతిట్ట జిల్లా కలెక్టర్​, కొన్నీ నియోజకవర్గ ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగారు.

District Collector and MLA trekked kilometres to carry rice and groceries to a tribal settlement
నిత్యవసర సరుకులు మోస్తూ 3కిలోమీటర్లు నడిచిన కలెక్టర్​, ఎమ్మెల్యే!

కైతాంగు పథకంలో భాగంగా..

పతనంతిట్ట జిల్లాలోని అవినిప్పర తండాలో 37 గిరిజన కుటుంబాలు ఉన్నాయి. వారికి కైతాంగు(చేయూత) పథకం ద్వారా సాయం చేయాలనుకున్నారు పతనంతిట్ట జిల్లా కలెక్టర్​ పీబీ నూహ్​, కొన్నీ నియోజకవర్గ ఎమ్మెల్యే కేయూ జనేశ్​కుమార్.​

కానీ, పెరియర్​ జీవారణ్యంలో 12 కిలోమీటర్ల లోపలున్న అవినిప్పరకు వెళ్లేందుకు మీనాచిల్​ నదిని దాటడం తప్ప వేరే మార్గం లేదు. అయినా సరే, తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. సామాజిక దూరం పాటించేందుకు వీలుగా అతి తక్కువ మందితో కూడిన బృందంతో కలిసి నడక ప్రారంభించారు. అడవి గుండా 3 కిలోమీటర్ల వరకు, భుజాలపై సరకులు మోసుకెళ్లి గిరిపుత్రులను ఆదుకున్నారు.

ఇదీ చదవండి:ఒక్కొక్కరికి రెండు మాస్కులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.