పొన్నూరులో పవన్​ కల్యాణ్​ రాకకు ఏర్పాట్లు- హెలిప్యాడ్ ధ్వంసం చేసిన వైఎస్సార్సీపీ నేతలు - Pawan Kalyan Helipad

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 4, 2024, 12:35 PM IST

thumbnail
పొన్నూరులో పవన్​ కల్యాణ్​ రాకకు ఏర్పాట్లు- హెలిప్యాడ్ ధ్వంసం చేసిన వైఎస్సార్సీపీ నేతలు (ETV Bharat)

YSRCP Leaders Destroyed Pawan Kalyan Helipad Ponnur Guntur District : ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా వైఎస్సార్సీపీ నేతలు కూల్చివేతల సంస్కృతిని మాత్రం వీడలేదు. తాజాగా గుంటూరు జిల్లా పొన్నూరులో జనసేనాని పవన్‌కళ్యాణ్‌ దిగవలసిన హెలిప్యాడ్‌ను జేసీబీతో వైఎస్సార్సీపీ నేతలు ధ్వంసం చేశారు. పట్టణంలోని ఐలాండ్‌ సెంటర్లో ఆదివారం బహిరంగ సభకు రావడానికి హెలిప్యాడ్‌ కోసం కూటమి నేతలు దరఖాస్తు చేశారు. 

ఇటీవల సీఎం జగన్‌ పొన్నూరులో బహిరంగసభ సందర్భంగా స్థానిక సజ్జా ఫంక్షన్‌ హాల్‌ వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌ను వాడుకోవాలని టీడీపీ నేతలకు అధికారులు సూచించారు. విషయం తెలిసిన వైఎస్సార్సీపీ నేతలు తమ నాయకుడి కోసం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను ఎలా వాడుకుంటారని రాత్రికి రాత్రే ధ్వంసం చేశారు. జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ ఆదివారం పొన్నూరు రానున్నారని స్థానిక నేతలు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు పవన్​ కల్యాణ్​ దిగవలసిన హెలిప్యాడ్​ను వైఎస్సార్సీపీ నేతలు ధ్వంసం చేయడంతో మరో చోట స్థలాన్ని పరిశీలించుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.