ఒంటరి మహిళపై వైఎస్సార్సీపీ నాయకుల దారుణం
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 25, 2024, 1:40 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/25-01-2024/640-480-20589000--thumbnail-16x9-ysrcp-leaders-attack-on-women-in-satyasai-district.jpg)
YSRCP Leaders Attack On Women In Satyasai District : శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం భానుకోటలో వైఎస్సార్సీపీ వర్గీయులు సొంత పార్టీకి చెందిన ఒంటరి మహిళపై దాడి చేశారు. ఈ నెల 22న భానుకోట గ్రామంలో మాజీ మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీకి చెందిన ఓ మహిళ తన ఆవేదనను వెళ్లబోసుకున్నారు. తన భర్త కరోనాతో చనిపోతే ఆదుకుంటామని చెప్పిన వైఎస్సార్సీపీ నాయకులు తనను లైంగికంగా వేధించారని చెప్పారు.
పింఛను తప్ప తనకు ఎలాంటి సహాయం అందలేదని కన్నీటిపర్వతం అయ్యారు. స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు కొంతమంది లైంగికంగా తనను ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. ఈ అంశం మీడియాలో రావడంతో స్థానిక వైఎస్సార్సీపీ సర్పంచ్తో పాటు మరికొందరు ఆ మహిళపై కర్రలతో దాడి చేశారు. అడ్డు వచ్చిన బంధువులపైన దాడికి పాల్పడ్డారు. దాడిలో గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.