వైఎస్సార్సీపీ నుంచి భారీగా వలసలు - టీడీపీలో చేరికలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 20, 2024, 10:50 PM IST
YSRCP activists joined Telugu Desam: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడితోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి కళావెంకటరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రణస్థలం మండలం తిరుపతిపాలెం గ్రామానికి చెందిన 30 వైఎస్సార్సీపీకి చెందిన కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా వారికి టీడీపీ కండువా కప్పి కళావెంకటరావు పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కళావెంకటరావు మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ పాలనతో విసిగిపోయి టీడీపీలోకి వలసలు మెుదలయ్యాయని తెలిపారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం అరాచకాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయని ఆరోపించారు. తప్పులను ప్రశ్నించిన వారిపై వైఎస్సార్సీపీ నేతలు దాడులకు పాల్పడటాన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు చేసిన వారిని ఎమ్మెల్యేలు వెనుకేసుకస్తున్నారని ఆరోపించారు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జనసేన- టీడీపీ పొత్తులో భాగంగా రాబోయే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ప్రభంజనం సృష్టిస్తుందని పేర్కొన్నారు. ఏపీకి చంద్రబాబు నాయుడే సీఎం అవుతారని జోష్యం చెప్పారు.