వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత ఆఫీస్​ను చుట్టుముట్టిన ఓటర్లు- సర్దిచెప్పి పంపేసిన పోలీసులు - Voters Protest at Geetha Office

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 12, 2024, 3:33 PM IST

Updated : May 12, 2024, 3:50 PM IST

thumbnail
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత ఆఫీస్​ను చుట్టుముట్టిన ఓటర్లు- సర్దిచెప్పి పంపేసిన పోలీసులు (ETV Bharat)

Voters Protest at Vanga Geetha Office: శనివారంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికలకు మరికొన్ని గంటల సమయమే ఉంది. ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అధికార ప్రార్టీ నేతలు తీవ్రస్థాయిలో యత్నిస్తున్నారు. అనేక ప్రాంతాల్లో బహుమతులను, నగదును రహస్యంగా పంపిణీ చేస్తున్నారు. తాయిళాలను ఎరవేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అందుకు పిఠాపురంలో జరిగిన సంఘటనే నిదర్శనంగా నిలుస్తోంది. 

కాకినాడ జిల్లా పిఠాపురంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత కార్యాలయాన్ని ఓటర్లు చుట్టుముట్టారు. వైఎస్సార్సీపీ నాయకులు కొంతమందికి మాత్రమే డబ్బు ఇచ్చారని, తమకు ఇవ్వలేదంటూ ఆందోళనకు దిగారు. అనేక మంది మహిళా ఓటర్లు మూకుమ్మడిగా కార్యాలయం వద్ద నినాదాలు చేశారు. డబ్బులు ఇస్తామని చెప్పి మోసం చేశారని, తమకు అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు ఇచ్చే వరకు కదిలేది లేదని ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి ఓటర్లతో మాట్లాడి అక్కడి నుంచి పంపించేశారు. కేవలం ఈ ప్రాంతంలో మాత్రమేకాక రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలే వెలుగుచూస్తున్నాయి. 

Last Updated : May 12, 2024, 3:50 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.